విజయనగరంలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

కొత్త ఇంటికి స్లాబ్ నిమిత్తం ఐరన్ రాడ్లను అమర్చే క్రమంలో పట్టుకున్న ఇనుప చువ్వ ప్రమాదవ శాత్తూ దగ్గరలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కేసరి, చంద్రశేఖర్ లు ఇద్దరూ కరెంట్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన అంగన్వాడీ ఆయా రియమ్మ వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె కూడా విద్యుత్ షాక్..

author-image
By E. Chinni
New Update
విజయనగరంలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

Three persons died : కరెంట్ షాక్ తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని విజయనగరం(Vizianagaram) జిల్లాలో జరిగింది. జిల్లాలోని సంతకవిటి మండలం సోమన్న పేటలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించారు. అదే గ్రామానికి చెందిన రామినాయుడు ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు భవన నిర్మాణ కార్మికులు వచ్చారు.

కొత్త ఇంటికి స్లాబ్ నిమిత్తం ఐరన్ రాడ్లను అమర్చే క్రమంలో పట్టుకున్న ఇనుప చువ్వ ప్రమాదవ శాత్తూ దగ్గరలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కేసరి, చంద్రశేఖర్ లు ఇద్దరూ కరెంట్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన అంగన్వాడీ ఆయా రియమ్మ వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెకి కూడా విద్యుత్ షాక్ తగిలింది.

ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అయితే కూలి పని కోసం వెళ్లి కేసరి, చంద్రశేఖర్.. వారిని కాపాడే ప్రయత్నంలో అంగన్వాడీ ఆయా రియమ్మ చనిపోవడంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు