Kiss Issue: కాబోయే భార్యకు ముద్దు పెట్టిన వరుడు.. పెళ్లి పందిట్లో చావబాదిన బంధువులు! పెళ్లి పందిట్లో కాబోయే భార్యకు పెట్టిన ముద్దు వరుడి ప్రాణాల మీదకు వచ్చింది. వరమాల వేయగానే బహిరంగంగా ముద్దు పెట్టడంపై పెళ్లి కూతురు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాలు కర్రలతో కొట్టుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. By srinivas 23 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Marriage: పెళ్లి పందిట్లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో సంబురంగా జరుగుతున్న వివాహ వేడుకలో వరుడి ముద్దు చిచ్చు రేపింది. తనకు కాబోయే భార్యకు ప్రేమగా పెట్టిన ముద్దు తన ప్రాణాలమీదకు తెచ్చింది. చివరకు ఇరు కుంటుంబాలు కర్రలతో చావ బాదుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ గొడవకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరమాల వేయగానే ముద్దు.. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్లోని హాపూర్లోని ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు ఒకేసారి జరుపుతున్నాడు. ఇందులో మొదటి కూతురు పెళ్లి సజావుగా పూర్తి కాగా.. కొద్దిసేపటి తర్వాత మరో కూతురు పెళ్లి తంతు మొదలైంది. ఈ క్రమంలోనే వరమాల వేయగానే వధువుకు బహిరంగంగా ముద్దు పెట్టాడు వరుడు. అయితే ఈ వ్యవహారంపై వధువు బంధువులకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇరువర్గాల వారు పరస్పరం కర్రలతో దాడి చేసుకోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: PM Modi: ఎన్నికల ప్రచారంలోనే మోడీని చంపేస్తాం.. అగంతకుడి వార్నింగ్! అయితే దీనిపై మాట్లాడిన పెళ్లి కూతురు తండ్రి.. తమ కూతురు నిరాకరిస్తున్నా బలవంతం చేశాడని వాపోయారు. అందరిముందు ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. వరుడు మాత్రం ఆమె అంగీకారంతోనే ముద్దు పెట్టుకున్నానని చెబుతున్నాడు. అయితే ముద్దు గొడవపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. కానీ కర్రలతో దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. #marriage #groom #uttarapradesh #bride సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి