TG RTC: మీరు 8 పాసయ్యారా..అయితే ఈ గొప్ప అవకాశం మీకోసమే అంటున్న టీజీఆర్టీసీ!

చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
TG RTC: మీరు 8 పాసయ్యారా..అయితే ఈ గొప్ప అవకాశం మీకోసమే అంటున్న టీజీఆర్టీసీ!

TG RTC: చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఆర్టీసీ సంస్థ ఐటిఐ కాలేజీలను నిర్వహిస్తున్న విషయం గురించి అందరికీ తెలిసిందే. ఈ కాలేజీలలో యువతకు వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలను చూపెడుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెకానిక్ డీజిల్, వెల్డర్, మోటార్ మెకానిక్ వెహికల్, పెయింటర్ లాంటి వివిధ ట్రేడులలో ప్రవేశం కల్పించబోతున్నారట.

ఇక ఈ కాలేజీలో ప్రవేశం కోసం జూన్ 10 చివరి తేదీ. ఆ సమయం లోపు దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ఆర్టీసీ ఐటిఐ కాలేజ్లలో శిక్షణ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ట్రేడ్స్ లో చేరేందుకు అర్హత ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తోంది. ఇక శిక్షణ కొరకు వెబ్ సైట్ ను ఉపయోగించి అప్లికేషన్ పెట్టాలి. ఈ కోర్సులలో మోటార్ మెకానిక్ రెండు సంవత్సరాల వ్యవధి, మెకానిక్ డీజిల్ ఏడాది శిక్షణను కలిగి ఉంటుంది.

ఈ రెండు ట్రేడ్స్ చదవాలన్నవారు కచ్చితంగా పదవ తరగతి పాసై ఉండాలి. అలాగే పెయింటింగ్ శిక్షణకు రెండు సంవత్సరాలు, వెల్డింగ్ అయితే ఏడాదికాలం శిక్షణను కలిగి ఉంటుంది. వీటికి కేవలం ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు. ఇందులో కేవలం కొన్ని పరిమిత సీట్లు మాత్రమే ఉంటాయి.

Also read: ఢిల్లీ విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు.

New Update
P. chidambaram

P. chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

హాస్పిటల్‌లో చేర్పించి అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు