Yadagiri Gutta: ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!

యాదగిరిగుట్ట ఆలయ నగరంలో మద్యం, మాసం, జంతువధపై నిషేదం అమల్లో ఉండనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు.

New Update
Yadadri

Yadadri Photograph: (Yadadri)

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ్మస్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా టీటీడీ తరహాలో పాలకమండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాజాగా.. యాదగిరిగుట్ట ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.

Also Read: Sudeeksha Konanki: మా కుమార్తె చనిపోయిందని ప్రకటించండి.. సుదీక్ష తల్లిదండ్రుల షాకింగ్‌ రిక్వెస్ట్‌!

ది తెలంగాణ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ బిల్లుకు అసెంబ్లీలో మంగళవారం ఆమోదం తెలిపాయి. గవర్నర్ ఆమోద ముద్ర తరువాత.. పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది.

Also Read: Ap weather: ఏపీ ప్రజలకు మాడు పగిలే వార్త...ఆ జిల్లాల్లో ఏకంగా 42 డిగ్రీల ఎండ..జాగ్రత్త!

Yadagirigutta Temple

శాసనసభలో బిల్లుపై ప్రసంగించిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. రూ.100 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.  18 మందితో యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డును ఛైర్మన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేస్తామన్నారు. ఐఏఎస్‌ లేదా కమిషనర్‌ స్థాయి అధికారిని ఆలయ ఈవోగా నియమిస్తామని చెప్పారు. పాలకమండలికి పూర్తిగా స్వయంప్రతిపత్తి ఉంటుందని చెప్పారు. 

శాశ్వత ధర్మకర్తలకు సభ్యత్వం, ఓటుహక్కు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఒక్కొక్కరు చొప్పున ఎస్సీ, ఎస్టీ, మహిళా సభ్యులను నియమిస్తామని.. బోర్డు కాలపరిమితి రెండేళ్లు ఉంటుందన్నారు.ప్రస్తుతం యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రతి ఏడాది రూ.224 కోట్ల వార్షిక రాబడి వస్తుందని మంత్రి సురేఖ వెల్లడించారు. 1,241 ఎకరాల భూమి ఉందని.. దీన్ని ఆలయ నగరంగా మారుస్తున్నామన్నారు. టెంపుల్‌ సిటీ పరిధిలోకి మూడు మున్సిపాలిటీలతో పాటుగా మూడు గ్రామపంచాయతీలు, ఆరు గ్రామాలు వస్తాయన్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట ఆలయ నగరంలో జంతువధపై పూర్తిగా నిషేధం ఉంటుందన్నారు. టీటీడీ తరహాలోనే.. జంతువులను వధించడం, మద్యం, మాంసం విక్రయాలు, లైసెన్స్‌ లేని విక్రయాలు, పాచికల ఆటలపై నిషేధం ఉంటుందని అధికారులు  చెప్పారు. ట్రస్ట్ బోర్డు విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తుందని.. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం, బోధించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలని, భక్తులకు సౌకర్యాలు పెంచాలని బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Also Read: Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్‌ కమిషన్‌!

Also Read: Ap Crime: జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి యువ సాఫ్ట్‌వేర్ మృతి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: గురుకులాల్లో కోడింగ్‌ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !

తెలంగాణవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో దీన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

New Update
TGSWREIS

TGSWREIS

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు ఇందుకు మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో కోడింగ్‌ కోర్సుపై శిక్షణ ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. 

గతేడాది మొయినాబాద్‌ గురుకుల పాఠశాలలో మాత్రమే కోడింగ్‌పై శిక్షణ ఇచ్చామని.. ఇప్పుడు అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నామని తెలిపారు. అయితే ఈ శిక్షణ కోసం గురుకుల సంస్థ యూకేలోని లండన్‌కు చెందిన ర్యాస్ప్ బెర్రీపై పౌండేషన్ (RBF) తో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్, కరిక్యులమ్. మానిటరింగ్, టీచింగ్, యాక్షన్ ప్లాన్ వంటి వివిధ అంశాల్లో ఫౌండేషన్ నిర్వహకులు పాలు పంచుకోనున్నారు. 

Also read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్‌లైన్ టూల్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించేందుకు అంతా సిద్ధం చేశారు. గురుకుల సంస్థ ఈ కోడింగ్‌ శిక్షనను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రతి పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు చేసింది. దీని ఫలితాలు మెరుగ్గా రావడంతో ఫౌండేషన్ ప్రతినిధులను గురుకుల అధికారులు ఒప్పించారు. అలాగే అన్ని పాఠశాలల్లో కంప్యూటింగ్ పాఠ్యాంశాలను రెగ్యులర్‌ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. 

Also Read: బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?

గురుకులాల్లో కోడింగ్ శిక్షణలో భాగంగా విద్యార్థులకు 2 గంటల పాటు బోధిస్తారు. మరో రెండు గంటలు ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయిస్తారు. దాదాపు 1.52 లక్షల మంది విద్యార్థులకు కంప్యూటింగ్ పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుగా నేర్పించి పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేస్తారు. అయితే గురుకులాల్లో విద్యార్థులకు కోడింగ్ టెక్నాలజీని నేర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారని.. ఇదొక మైలురాయిగ నిలుస్తుందని సెక్రటరీ అలుగు వర్షిణి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కోడింగ్‌ శిక్షణ, బోధన కోసం స్కూల్స్‌లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లను కూడా తీసుకొస్తామని చెప్పారు.  

Advertisment
Advertisment
Advertisment