Congress MLC candidates : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి..ఎవరెవరంటే?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు గడువు ఒకరోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం ఫైనల్‌ లిస్టును ఈ రోజు సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉంది.

New Update
Gandhi Bhavan

Gandhi Bhavan

Congress MLC candidates : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు గడువు ఒకరోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం ఫైనల్‌ లిస్టును ఈ రోజు సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉంది.  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తోంది.  ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోనూ తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. రాష్ర్ట నేతల అభిప్రాయం తీసుకున్న మీనాక్షి కాసేపట్లో హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నాలుగు సీట్లలో ఒకటి సీపీఐకి ఇచ్చే అవకాశం ఉండగా  మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు పూర్తయింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: UP: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!
 
ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ ( నల్గొండ డీసీసీ), నెహ్రూ నాయక్ (మహబూబాబాద్) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓసీ కోటాలో జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇంఛార్జ్ కుమార్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీకి అవకాశం లేదు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఉన్నవారికి కూడా అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

ఎమ్మెల్యే కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీల కోసం అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆదివారం అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా శాసనసభలో కాంగ్రెస్‌కున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి 4 దక్కనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వీటిలో ఒకటి తమకు కేటాయించాలని సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్‌ను గట్టిగా కోరింది. సీపీఐ జాతీయ నేతలు దిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని కూడా సంప్రదించినట్లు సమాచారం. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో కాకుండా భవిష్యత్తులో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటును సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు కొందరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.  

ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!

కాంగ్రెస్‌లో ఆశావాహులు ఎక్కువగా ఉండటం, ఒకరికి ఇస్తే మరొకరి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో నాలుగు సీట్లలోనూ తామే పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అవసరమైతే సీపీఐకి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ కేటాయించాలని చూస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్కో సీటు ఇవ్వాలనే ప్రతిపాదన కాంగ్రెస్‌లో ఉంది. సీపీఐకి ఇవ్వకున్నా 4 వర్గాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ వర్గాలకు టికెట్‌ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.  ఒకవేళ సీపీఐ ఈ విషయంలో అంగీకరించకపోతే తప్పకుండా వారికి ఒక సీటు ఇవ్వాల్సిందే.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !

నాంపల్లి నియోజకవర్గం మురాద్‌నగర్‌లోని ఓ భవనంలో​ లిఫ్ట్‌ ​కుప్పకూలింది. దీంతో ఫోర్త్‌ ​ఫ్లోర్‌లో ​నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌​కు పడిపోయింది. ఈ ప్రమాదంలో సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది.

New Update
Hyderabad Lift Accident:

Hyderabad Lift Accident:

ఈ మధ్య కాలంలో లిఫ్ట్‌ కులిన ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో నగర ప్రజలు.. లిఫ్ట్‌ ఎక్కాలంటేనే భయ పడుతున్నారు. తాజా నాంపల్లి నియోజకవర్గంలో మరో ఘటన నగర వాసులను భయభ్రతులకు గురి చేస్తోంది. మురాద్‌నగర్‌లోని ఓ భవనంలో​ లిఫ్ట్‌ ​కుప్పకూలింది. దీంతో ఫోర్త్‌  ​ఫ్లోర్‌లో ​నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌​కు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. చోటి మసీద్‌ ​సమీపంలోని నాకో షమ్స్ అపార్ట్‌మెంట్ ఉంది. దానిలోని ​ఫోర్త్‌  ​ఫ్లోర్‌లో ఉంటున్న మక్సుద్ ఇంటికి ఆదివారం రాత్రి లంగర్‌హౌస్‌లో ఉండే బంధువు సయ్యద్ నసీరుద్దీన్, మైమూనా బేగం, సబీనా బేగం, ముగ్గురు పిల్లలు వచ్చారు. ఫోర్త్‌  ​ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్​ ఎక్కారు. ఫోర్త్‌  ​ఫ్లోర్‌ వరకు వెళ్లిన లిఫ్ట్.. ఒక్కసారిగా కిందికి పడి గ్రౌండ్‌ ఫ్లోర్‌​లో ఆగింది. లిఫ్ట్‌లో ఉన్న సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది.  

Also Read :  కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం

ఇది కూడా చదవండి: డయాబెటిస్ ఉన్నవారు జిమ్‌ చేస్తే ఏమవుతుంది?

Hyderabad Lift Accident At Nampally

గాయపడిన క్షతగ్రతులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న.. ఎమ్మెల్యే మజీద్ ​హుస్సేన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం ప్రమాదం జరిగిన పరిస్థితిని పరిశీలించారు. లిఫ్ట్‌ ​ప్రతిసారీ రిపేర్ అవుతోందని, గతంలో లిఫ్టు మధ్యలో ఇరుక్కుపోయిందని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. లిఫ్ట్ రిపేర్‌లో ఉన్న విషయం తెలియక నసీరుద్దీన్, కుటుంబ సభ్యులు ఎక్కారని, లిఫ్ట్‌ ​దగ్గర ఎలాంటి సూచిక బోర్డులు పెట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. నాంపల్లి నియోజకవర్గంలో వరుసగా లిఫ్టు ప్రమాదాలు జరగటంతో కాలనీ వాసులు లిఫ్ట్‌ ఎక్కాలన్న భయ పడుతున్నారు.  

ఇది కూడా చదవండి: ఆదిలాబాద్‌లో దారుణం..12 ఏళ్ల బాలికను అడవిలోకి తీసుకెళ్లి.. దగ్గరుండి ఇద్దరితో రేప్ చేయించిన మహిళ!

Also Read :  ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కు పెను ప్రమాదం.. విడిపోయిన బోగీలు.. వివరాలివే!



(latest-telugu-news | today-news-in-telugu | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | accident | lift)

Advertisment
Advertisment
Advertisment