TGSRTC: 5 లక్షల మందిని తీసుకెళ్ళిన టీజీఎస్‌ఆర్టీసీ

సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ నుంచి ఆంధ్రాకు జనాలు విపరీతంగా తరలి వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా సొంతూళ్ళకు వెళ్ళి ఉంటారని అంచనా. దీంట్లో ఒక్క టీజీఎస్ఆర్టీసీనే 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. 

New Update
tgsrtc buses

tgsrtc buses Photograph: (tgsrtc buses )

రెండు రోజులుగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్ళే బస్సులు, ట్రైన్‌లు,ఫ్లైట్‌లు అన్నీ రద్దీగా ఉంటున్నాయి. వేటిల్లోనూ ఖాళీలు లేవు. రేట్లు పెంచి బస్సులు నడుపుతున్నా...జనాలు ఎక్కడా తగ్గడం లేదు. పండుగకు ఇంటికి వెళ్ళడమే ముఖ్యమని అనుకుంటున్నారు. ప్రవైటు బస్సులు విపరీతంగా ఛార్జీలను పెంచేశాయి.ఈ కారణంగా చాలా మంది ఆర్టీసీ బస్సులను బాట పడుతున్నారు. దీంతో ఆర్టీసీకి కాసుల వర్షం కురుస్తోంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. 

6 వేలకు పైగా...

ఈ పండుగల్లో టీజీఎస్ ఆర్టీసీ మొత్తం 6,432 బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే వేలకు పైగా బస్సులు నడిపింది.  మిగతా రెండు రోజుల్లో మరిన్ని బస్సులను నడుపతామని చెప్పింది. అయితే మరో కొన్ని గంటలపాటు రద్దీ కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

 ఇక మూడేళ్ల తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి రాబోతోంది. ఇదే సమయంలో 19 ఏళ్ల తర్వాత మరో అరుదైన ఘటన కూడా వస్తోంది. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగతో పాటు భౌమ పుష్య యోగం కూడా రాబోతుంది. ఈ యోగంలో ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకున్నారు. మళ్లీ ఇప్పుడు అదే తేదీన పండుగను జరుపుకుంటున్నారు. జనవరి 14వ తేదీన ఉదయం 8.56 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఏవైనా శుభ కార్యాలు తలపెట్టిన అన్నింటా విజయమే లభిస్తుంది. నర్మదా, గంగా వంటి పుణ్య నదుల్లో కూడా ఈ సమయంలోనే స్నానం చేస్తారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment