Terrorists: హైదరాబాద్, వైజాగ్‌లో ఉగ్రవాదులు.. దాడులు చేసేందుకు భారీ ప్లాన్

తెలుగు రాష్ట్రాలకు ఉగ్రముప్పు పొంచిఉండటం కలకలం రేపుతోంది. హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థ.. హైదరాబాద్‌, వైజాగ్‌లో మకాం వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ భద్రతా సంస్థలను అలెర్ట్ చేసింది.

New Update

తెలుగు రాష్ట్రాలకు ఉగ్రముప్పు పొంచిఉండటం కలకలం రేపుతోంది. హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థ.. హైదరాబాద్‌, వైజాగ్‌లో మకాం వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడులను ముందుగానే పసిగట్టిన ఎన్‌ఐఏ అప్రమత్తమైంది. భద్రతా సంస్థలకు అలెర్ట్ చేసింది. ఈ సంస్థతో అనుబంధమున్న పలువురు అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేసింది. ISIS తర్వాత భారత్‌కు హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్‌ అతిపెద్ద ముప్పుగా మారుతోందని ఎన్‌ఐఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Also  Read: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?

Terrorists

ఇటీవల రెండురోజుల పాటు జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో ఈ సంస్థ దేశానికి అతిపెద్ద ప్రమాదకరంగా మారుతోందని ఎన్‌ఐఏ భావించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. మధ్యప్రదేశ్‌లో కూడా హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్ సంస్థకు స్లీపర్ సెల్స్‌ ఉన్నట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ సంస్థ బంగ్లాదేశ్‌లో కూడా చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి దీనిపై నిషేధం వేటు వేసింది. 

Also Read :  రీమేక్ వద్దని చెప్తే వినలేదు.. వాటి మీదైనా దృష్టి పెట్టుంటే హిట్ అయ్యేదేమో

అయితే ఈ హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్ ఉగ్ర సంస్థ అనేక ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొంటోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అమాయక యువతను ఉగ్ర సంస్థల్లో చేరేలా ప్రేరేపించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరించడం వంటి పనులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ సంస్థ దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పు అని తెలిపింది. 

Also read: వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే

జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చేసి.. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలను స్థాపించడమే హిజ్బ్‌-ఉత్-తాహిర్ ఉగ్రసంస్థ లక్ష్యమని కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. భారతీయ పౌరులను మతం పేరుతో ఆకర్షించి వారి మైండ్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మార్చుతోందని తెలిపింది. మరోవైపు ఈ ఉగ్రసంస్థ సామాజిక మాధ్యమాల కూడా విస్తృతంగా ఉపయోగించుకుంటోందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

Also Read :  వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment