Minister Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ

తెలంగాణ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇంట్లో మొబైల్ ఫోన్‌ చోరీకి గురైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మంత్రి ఇంట్లో దీపావళి రోజున మొబైల్ చోరీకి గురైందని, వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

New Update
Sridhar Babu: పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలమైంది: మంత్రి శ్రీధర్‌బాబు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఇంట్లో ఇటీవల చోరీగా జరగ్గా.. ఇప్పుడు మళ్లీ మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మంత్రి ఇంట్లో దీపావళి రోజున మొబైల్ చోరీకి గురైంది. ఆ మొబైల్‌ను వెతికి పెట్టాలని మంత్రి శ్రీధర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీపావళికి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

ఇది కూడా చూడండి: Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం!

గతంలో డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ..

ఇదిలా ఉండగా ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఇంట్లో కూడా చోరీ జరిగింది. భట్టి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు. చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్‌‌లోని ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. 

ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

వెంటనే పోలీసులు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు దొంగలమని ఒప్పుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్

వరుసగా తెలంగాణలో చోరీలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ ఉండే రాజకీయ నాయకుల ఇంట్లోనే చోరీలు జరగడంతో మిగతా సామాన్య కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి వాటిల్లతుందని ప్రజలు భయపడుతున్నారు.

ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Butta Renuka: వైసీపీకి భారీ షాక్... మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్‌ఐసీ హౌసింగ్‌ సంస్థ నుంచి రూ.360 కోట్లు తీసుకొని చెల్లించలేదు. దీంతో అప్పుకోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది.దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

New Update
Butta Renuka

Butta Renuka

Butta Renuka: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్‌ఐసీ హౌసింగ్‌ సంస్థ నుంచి దాదాపు రూ.360 కోట్ల రుణం తీసుకొని బురిడీ కొట్టేశారు. దీంతో అప్పు కోసం బుట్టా రేణుక దంపతులు తనఖా పెట్టిన ఆస్తులను  వేలం వేయనున్నట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది. దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. బుట్టా దంపతులు దాదాపు రూ.360 కోట్లను రెండు రుణ ఖాతాల ద్వారా తీసుకున్నారు. ఈ రుణానికి 2019 నవంబరు 18న బుట్టా రేణుక, బీఎస్‌ నీలకంఠకు డిమాండ్‌ నోటీసు పంపింది. ఈ ఆస్తుల రిజర్వు ధరను రూ.360 కోట్లుగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ పేర్కొంది. ఈ ఆస్తులన్నింటినీ ఏకమొత్తంలో ఈ-వేలం ద్వారా విక్రయిస్తామని పేర్కొంది.

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

తీసుకున్న రుణానికి కొంతకాలంపాటు కిస్తీలు సక్రమంగా చెల్లించినప్పటికీ ఐదేళ్ల నుంచి తిరిగి చెల్లించడం లేదు. ఇప్పటికే సంస్థ బెంగళూరు బ్రాంచి ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపడంతోపాటు సంప్రదింపులు జరిపినప్పటికీ బుట్టా దంపతులు స్పందించలేదు. బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠలు 2018లో 15ఏళ్ల కాలవ్యవధిలో తిరిగి చెల్లించేలా రూ.310 కోట్ల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్, మెరిడియన్‌ ఎడ్యుటెక్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలకు రుణాన్ని వినియోగించారు. రుణంపై సుమారు రూ.40 కోట్ల వరకు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా రూ.340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూలు చేయాలని వారు కోరారు.

Also Read :  ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

కరోనా మహమ్మారి సమయంలో బుట్టా రేణుకకు సంబంధించిన పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఇక ఆ ప్రభావం బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు బుట్టా రేణుకకు సంబంధించిన ఇతర సంస్థల పైన కూడా పడింది. దీంతో బకాయిలు పేరుకుపోవడంతో తిరిగి చెల్లించని నేపథ్యంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే బకాయిల చెల్లింపు అంశంపై బుట్టా రేణుక నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకున్నారు. ఎన్సీఎల్టీలో కేసు ఉండగా వేలం ప్రకటన వేయడం నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక వాదిస్తున్నా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం అదేమీ పట్టించుకోవటం లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెళ్తుంది.

Also Read :  నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపాదన ఉందని హెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రతినిధులు అంగీకరించలేదు. రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా రూ.3.40 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం భారంగా మారినందున తొలుత తక్కువ మొత్తం తీసుకుని, చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదననూ హెచ్‌ఎఫ్‌ఎల్‌ తిరస్కరించింది. రుణాలు చెల్లించడం ఆపేసినందున హెచ్‌ఎఫ్‌ఎల్‌.. ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. రుణ నిబంధనలకు అనుగుణంగా బుట్టా రేణుక దంపతులకు చెందిన బంజారాహిల్స్‌లోని ఐదువేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మాదాపూర్‌లోని 7,205 చ.గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్‌ వేలానికీ స్పందన రాలేదు. మరోసారి వేలానికీ ప్రయత్నిస్తున్నారు. వేలంలో పాడుకుంటే ఇబ్బందులు వస్తాయోనని చాలామంది వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read :  టీచర్ కాదు టార్చర్.. హోం వర్క్ చేయలేదని విద్యార్థినితో దారుణం.. లేడీ టీచర్‌కు రూ.2 లక్షల జరిమానా!

 
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు