/rtv/media/media_files/2026/02/19/smart-cards-2026-02-19-12-09-00.jpg)
తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం(mahalakshmi-scheme)) కోసం ఇకపై ఆధార్ కార్డు(aadhaar-card) పట్టుకుని తిరగాల్సిన పనిలేదు. త్వరలోనే మీ చేతికి స్మార్ట్కార్డులు రాబోతున్నాయి. అవును.. 2026 జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నుంచి ఈ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించి, కార్డుల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్టీసీని ఆదేశించారు.
మొదటగా ఈ స్మార్ట్కార్డులను రాష్ట్రవ్యాప్తంగా కాకుండా జిల్లాకు ఒక మండలాన్ని ఎంచుకుని ప్రయోగాత్మకంగా పంపిణీ చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టులో సుమారు 5 లక్షల మంది మహిళలకు కార్డులు అందజేయనున్నారు. ఇందులో ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని సరిదిద్దిన తర్వాత, రాష్ట్రమంతటా ఉన్న మిగిలిన మహిళలకు కార్డులు జారీ చేస్తారు. ఈ స్మార్ట్కార్డు(TGSRTC Smart Cards) ల్లో ఒక ప్రత్యేక చిప్ ఉంటుంది, దీనివల్ల ప్రయాణికుల వివరాలు చాలా ఈజీగా రికార్డు అవుతాయి.
ఈ కార్డుపై మహిళ ఫోటోతో పాటు, కండక్టర్ దగ్గర ఉండే టికెట్ మిషన్ స్కాన్ చేసేలా ఒక క్యూఆర్ కోడ్ లేదా చిప్ ఉంటుంది. దీనివల్ల ప్రయాణికురాలు అసలైన లబ్ధిదారా కాదా అనేది వెంటనే తెలిసిపోతుంది.
Also Read : ఈటల, రఘునందన్కు బిగ్ షాక్.. పొత్తులపై హైకమాండ్ ఫైర్ !
మూడు రకాల డిజైన్లను సిద్ధం
ఈ కార్డుల కోసం ఆర్టీసీ మూడు రకాల డిజైన్లను సిద్ధం చేసింది. వీటిని ఇప్పటికే మంత్రులకు చూపించగా, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా పరిశీలించి ఒకదాన్ని ఫైనల్ చేయనున్నారు. ఈ చిప్ కార్డుల తయారీ కోసం సుమారు 75 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని ఆర్టీసీ కోరింది. కొత్త బడ్జెట్లో వీటికి అవసరమైన నిధుల కేటాయింపుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కార్డు నమూనాను ఫైనల్ చేసిన తర్వాత, అసలు కార్డు ఎలా ఉంటుంది? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అనే దానిపై పూర్తి మార్గదర్శకాలు విడుదలవుతాయి.
Also Read : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. తనను వారే కిడ్నాప్ చేశారన్న యాదగిరి
Follow Us