బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్‌ నుంచి తెప్పించి..

హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఓ బడ్డీ కొట్టులో ఒక్కో గంజాయి చాక్లెట్లు రూ.15 చొప్పున విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ నుంచి గంజాయి చాక్లెట్లు స్వాధీనం.

New Update
Ganja Chocolates: హైదరాబాద్ కు కూతవేటు దూరంలో.. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు.. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే టార్గెట్!

TG News: హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ బడ్డీ కొట్టులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.  గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారన్న  పక్క మేరకు సమాచారంలో  గౌతంనగర్ లోని స్లమ్ ఏరియాలో ఎన్టీఎఫ్ టీమ్ దాడులు నిర్వహించారు.   బీహార్ నుంచి  గంజాయి చాక్లెట్లను తీసుకువచ్చి హైదరాబాద్‌లోని పలు స్లమ్ ఏరియాల్లో చాక్లెట్లను అమ్ముతూన్నాడు. 

ఇది కూడా చూడండి:  హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు

గంజాయి చాక్లెట్లను స్వాధీనం:

ఒక్కో గంజాయి చాక్లెట్లను రూ.15 చొప్పున విక్రయిస్తున్నట్లు  అధికారుల తనిఖీల్లో తేల్చారు.  గంజాయి చాక్లెట్ల విక్రయాలలో ప్రజలు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని గురువారం ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి దగ్గర నుంచి 4.957కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

ఎక్సైజ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ పండరీ బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బోడుప్పల్లో పనిచేస్తూనే హైదరాబాద్‌లో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు గ్రహించారు. బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చి ఇక్కడ కూలీలకు నిందితుడు విక్రయిస్తున్నాడు. గౌతంనగర్ ప్రాంతంలోఉన్న స్లమ్ ఏరియాలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న నిందితుడిని అరెస్టు చేశారు. ఎస్సైలు అఖిల్ ఆధ్వర్యంలో.. వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు సుధాకర్, రవి, కిషన్‌రావు, సుధీష్, శ్రీనివాస్ తనిఖీల్లో పాల్గొన్నారు. కేసు దర్యాప్తు కోసం ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో అరటిపండు తినడం మంచిదేనా?

ఇది కూడా చూడండి: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: భట్టి విక్రమార్క

తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ.. లక్ష్యానికి మంచి రూ.21 వేల కోట్లు అందించామని తెలిపారు.

New Update
Batti Vikramarka

Batti Vikramarka

తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. హైదరాబాద్‌లో మహిళల భద్రతను పెంచడమే లక్ష్యంగా.. హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (HCSC) కలిసి నగర పోలీసులు మంగళవారం నిర్వహించిన ‘స్త్రీ’(షీ ట్రంప్స్‌ థ్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్‌ ఎంపవర్‌మెంట్‌) సమ్మిట్‌కు భట్టి విక్రమార్క హాజరయ్యారు. 

Also Read: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' స్త్రీలకు సమాన హక్కులు అందించి, రాజ్యాంగానికి రూపమిచ్చిన అంబేద్కర్ జయంతి మరుసటి రోజే ఈ సదస్సు జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్ని రకాల సాధికారిత కల్పించాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నాం. మహిళా సంఘాలకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ లక్ష్యానికి మంచి రూ.21 వేల కోట్లు అందించాం. గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా మహిళల్ని భాగస్వాములను చేస్తున్నాం. సోలార్ రంగంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మహిళా సంఘాలతో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. 

Also Read: కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తయారు చేయడంతో పాటు వాటిని అమలు చేస్తే మహిళ సాధికారత సాధ్యం అవుతుంది.దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని'' భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇంకా నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. 2024లో హైదరాబాద్‌లో 250 రేప్ కేసులు, 713 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలకు న్యాయం అందించేందుకు షీ టీమ్స్‌తో పాటు భరోసా కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

 telugu-news | rtv-news | batti-vikramarka | telangana 

Advertisment
Advertisment
Advertisment