Sankranti కి ఇంటికెళ్తే.. ఈ రూట్ బెటర్.. ఈజీగా వెళ్లిపోవచ్చు!

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వేరే మార్గాలను సూచిస్తూ రాచకొండ పోలీసులు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.   ఘట్కేసర్ (EXIT-9] నుండి భువనగిరి - వలిగొండ- రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చు అంటూ ట్వీట్ చేశారు.

New Update
vijayawada route

vijayawada route Photograph: (vijayawada route )

సంక్రాంతి పండగకు వరుసగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు రావడంతోనే హైదరాబాద్ లోని జనమంతా సొంతూళ్లకు పయనమయ్యారు.  దీంతో హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.  జనమంతా సొంతూళ్లకు కార్లలో, బైక్స్ పై వెళ్తుండటంతో ప్రధాన రాహదారులన్ని రద్దీగా ఉన్నాయి. 

Also Read :  నెత్తురొడిన కరీంనగర్ రహదారులు.. ఐదుగురు యువకులు స్పాట్ డెడ్!

హైదరాబాద్‌-విజయవాడ హైవే (Hyderabad-Vijayawada Highway) పై ఫుల్ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వేలాది కార్లు రోడ్డెక్కడంతో  విజయవాడ హైవేపై నెమ్మదిగా వాహనాలు సాగుతున్నాయి.. గంటలకు 30-40 కి.మీ. వేగాన్ని మించి వాహనాలు వెళ్లలేకపోతున్నాయి.. కొన్ని చోట్ల బంపర్‌ టు బంపర్‌ ట్రాఫిక్‌ ఏర్పడింది.  పంతంగా టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  అయితే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాచకొండ పోలీసులు వాహనదారులకు కీలక ప్రకటన చేశారు.  ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వేరే మార్గాలను సూచిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.  

Also Read :  ఇదెక్కడి స్కామ్ రా బాబు: మహిళలను గర్భవతిని చేస్తే రూ. 10 లక్షలట

సంక్రాంతి (Sankranti) కి ఆంధ్ర వైపుకు వెళ్లే వాహనదారులకు రాచకొండ పోలీస్ వారి విజ్ఞప్తి. పెద్ద అంబర్పేట్ (EXIT-11) నుండి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు సంక్రాంతి పండగ వల్ల వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం మూలాన వేరే మార్గాలు సూచించడం అయినది. ఘట్కేసర్ (EXIT-9] నుండి భువనగిరి - వలిగొండ- రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చు. గుంటూరు వైపు వెళ్లేవాళ్లు బొంగులూరు [EXIT-121] గేటు నుండి ఇబ్రహీంపట్నం -మాల్ - దేవరకొండ మీదుగా గుంటూరు చేరుకోవచ్చు అంటూ పోలీసులు ట్వీట్ చేశారు.  

Also Read :  ఇంకా మండుతూనే ఉంది..10వేల ఇళ్ళు బూడిద

పొంగల్‌  దోపిడీ షురూ

ఇక సంక్రాంతి రష్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు  ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు.  పొంగల్‌  దోపిడీ షురూ చేశారు.  రేట్లు ఆమాంతం పెంచేశారు.  ధరలు చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలుగా వసూలు చేస్తున్నారు. ఇక విజ‌య‌వాడకు రూ. 3 వేల లోపుంటే.. ప్రస్తుతం రూ.  6  వేలు వసూలు చేస్తున్నారు.  మాములుగా అయితే   హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి రూ.  1000 ఛార్జీ ఉంటుంది.  ఇక వైజాగ్ కు అయితే తక్కువలో తక్కువ రూ. 2 వేలు ఉంటుంది. కానీ ఈ  ప్రైవేటు ట్రావెల్స్‌ లో ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే త్రిబుల్ ఛార్జీలు పెట్టుకోవాల్సిందే. 

Also Read :  గోదావరి అమ్మాయితో ప్రభాస్ పెళ్లి..  డీటెయిల్స్ బయటపెట్టిన రామ్ చరణ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment