HCU Land Issue: HCU విద్యార్థులపై లాఠీ ఛార్జ్.. టెన్షన్ టెన్షన్

HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

New Update
HCU students lathi charged by Police

HCU students lathi charged by Police

తెలంగాణలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. HCUకి సంబంధించిన 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని, జంతువులను, అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఈ మేరకు హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. వందల మంది విద్యార్థులు హెచ్‌సీయూ గేట్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. 

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

విద్యార్థులపై లాఠీ ఛార్జ్

దీంతో HCU లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు తాజాగా కొరడా ఝులిపించారు. HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ లాఠీ ఛార్జ్ అనంతరం రేవంత్‌ సర్కారుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

మరోవైపు HCU లో విద్యార్థులకు ఉపాధ్యాయులు, యూనివర్సిటీ సిబ్బంది మద్దతుగా నిరసన తెలిపేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. 

Also Read: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

అలాగే చిన్నపిల్లలు సైతం HCUకి మద్దతుగా నిలుస్తున్నారు. HCU అడవుల్లో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని, ఆ అడవులను వైల్డ్ లైఫ్ సాంక్చురీగా ప్రకటించి జంతువులను, పక్షులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి 6వ తరగతి విద్యార్థి విజ్ఞప్తి చేసిన వీడియో వైరల్ అవుతుంది. 

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

 

(hcu campus land issue | hcu campus lands | revanth-reddy | latest-telugu-news | telugu-news | telangana-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Two rowdy sheeters : ఇద్దరు రౌడీషీటర్లపై నగర బహిష్కరణ వేటు

ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

New Update
Two rowdy sheeters

Two rowdy sheeters

Two rowdy sheeters :   ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

పోలీసు కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.....రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ పై 19 కేసులు, నాలుగు హత్య కేసులున్నాయి.  మరిన్ని కేసుల్లో అనుమానితుడిగా, నిందితుడిగా ఉన్నాడు. మరో క్రిమినల్ సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోహిన్ 21 కేసులతో పాటు, హత్య, హత్యాయత్నాల కేసులలో అనుమానితుడిగా, నిందితుడిగా నమోదయ్యాడు. ఇద్దరు రౌడీషీటర్లపై సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ  వేటు వేసినట్లు వివరించారు.

Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్‌!

Also Read:  America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!

 వీరు తీరు మార్చుకోక పోవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరి చర్యలతో ప్రజలకు ఇబ్బందిగా మారడంతో ఈ ఇద్దరి పై ఆరు నెలల పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ నుంచి బహిష్కరిస్తూ సీపీ సెక్షన్ సిటీ యాక్ట్ -261 ప్రకారం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరు రానున్న ఆరు నెలల కాలంలో కమిషనరేట్ పరిధిలో కనిపించిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. నగర బహిష్కరణ నిబంధనలను ఉల్లంఘించి కమిషనరేట్ పరిధిలో సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!

Also Read: America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!

Advertisment
Advertisment
Advertisment