PM Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. అక్కడి ప్రజలు ప్రతిజ్ఞ చేసి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి ఉత్సాహమే కనిపిస్తోందని చెప్పారు. 

New Update
PM Modi

PM Modi

హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ''నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు'' అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు ప్రతిజ్ఞ చేసి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి ఉత్సాహమే కనిపిస్తోందని చెప్పారు. 

Also read: మొదలైన మాటల యుద్ధం.. విజయ్‌ స్పీచ్‌పై స్టాలిన్ విమర్శలు

బెంగాల్‌లో ఓడిపోయింది రాజకీయ పార్టీ మాత్రమే కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను, అవినీతి, కుటుంబ పార్టీలను అక్కడి ప్రజలు ఓడించారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీలే. బెంగాల్ తరహాలోనే తెలంగాణలో కూడా ప్రజలు ఆశీర్వదించారు. పశ్చిమ బెంగాల్‌లో గెలిచాం. ఇప్పుడు తదుపరి టార్గెట్ తెలంగాణ. వచ్చే ఎన్నికల్లో ఇక్కడే రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. పార్టీ కార్యకర్తల్లో కూడా రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. 

Also Read: తప్పుడు ప్రచారాలు నమ్మకండి అన్నా.. తల వంచుకునే పనులు చేయను: బండి సంజయ్

కాంగ్రెస్‌ విద్వేష రాజకీయాలు రెచ్చగొడుతోంది. మావోయిస్టుల వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిఉంటే మావోయిస్టులను అణిచివేశారు. కాంగ్రెస్ ఎక్కడున్నా ఒకటే మోడల్. ఎన్నికలకు ముందు అమలు కానీ హామీలు ఇస్తారు. తీరా గెలిచాక వాటిని అమలు చేసేందుకు సాకులు వెతుకుతారు. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే జరుగుతోందని'' ప్రధాని మోదీ అన్నారు.

Advertisment
తాజా కథనాలు