Minor Girl Missing: జగిత్యాలలో మిస్సైన మైనర్ బాలిక ఆచూకి లభ్యం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పదవ తరగతి చదువుతున్న మైనర్‌ బాలిక శుక్రవారం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆమె ఆచూకి లభ్యమైంది. నిజామాబాద్‌లో పోలీసులు ఆమెను గుర్తించారు.

New Update
GIRL

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పదవ తరగతి చదువుతున్న మైనర్‌ బాలిక శుక్రవారం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆమె ఆచూకి లభ్యమైంది. నిజామాబాద్‌లో పోలీసులు ఆమెను గుర్తించారు.  బాలిక కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మెట్‌పల్లి పట్టణంలోని విజ్‌డమ్ హైస్కూల్ హాస్టల్లో ఇబ్రహీంపట్నంకు చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. గురువారం మధ్యాహ్నం భోజన సమయంలో స్నేహితులని కలిసి వస్తానని తన తోటి విద్యార్థులు చెప్పి వెళ్లిపోయింది. 

Also Read: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

అర్ధరాత్రి దాటినా కూడా ఆమె మళ్లీ హాస్టల్‌కు తిరిగిరాలేదు. దీంతో స్కూల్‌ యాజమాన్యం.. బాలిక కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వాళ్లు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల పలు కీలక విషయాలు చెప్పారు. గత కొంతకాలంగా పదవ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని స్కూల్ యాజమాన్యం ఒత్తిడిచ చేస్తున్నారని ఆరోపించారు. స్కూల్ యజమాని రామారావును కూడా బాలిక కుటుంబ సభ్యులు నిలదీశారు.  

Also Read: మరొక్క రోజే.. హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ ర్యాలీ.. అర్హులు ఎవరంటే?

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. పోలీసులు చొరవ తీసుకొని బాలికను అప్పగించాలంటూ వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల సీసీకెమెరాలు పరిశీలించారు. హాస్టల్‌ భవనంతో పాటు గదులు కూడా పర్యవేక్షించారు. చివరికి శుక్రవారం రాత్రి నిజామాబాద్‌లో ఆమె ఆచూకీ లభ్యం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆమె ఎందుకు వెళ్లిపోయిందన్న విషయంపై స్పష్టత రాలేదు.  

Also Read: నేను అడిగితేనే షిండే అలా చేశారు.. ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు

Also Read: వడ్డీ రేట్లు యథాతథమే..ఎలాంటి మార్పులు లేవు:ఆర్బీఐ గవర్నర్‌!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment