Maoist Attack: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌ పై మావోయిస్టుల మెరుపుదాడి

ఛత్తీస్‌ఘడ్‌–తెలంగణ బార్డర్లోని జీడిపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ మీద మావోయిస్టులుమెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు దాడికి దిగారు. ఇద్దరి మధ్యా కాల్పులు జరుగుతున్నాయి. 

New Update
encounter

ఛత్తీస్‌ఘడ్‌–తెలంగాణల బోర్డర్ అయిన జీడిపల్లిలో ఈ మధ్యనే కొత్తగా బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది హోంశాఖ.  ఇక్కడ కొంత పోలీసు బలగాన్ని ఉంచి ఎప్పటికప్పుడు మావోయిస్టు కార్యకలాపాలను అణిచి వేయడమే దీని ఉద్దేశం. అయితే ఈరోజు అదే మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. పీఎల్జీఏ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు క్యాంపుపై కాల్పులతో విరుచుకుపడ్డారు.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. అయితేయమావోయిస్టుల కాల్పులకుధీటుగా పోలీసులు కూడా ఫైట్ చేస్తున్నారు. ఎదురుదాడి చేస్తూ వారిని చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కూంబింగ్‌ను కూడా ఉధృతం చేశాయి సీఆర్పీఎఫ్ బలగాలు. 

 Also Read: శ్రీతేజ్ కుటుంబానికి అండగా 'పుష్ప2' టీమ్.. హాస్పిటల్ వెళ్లిన బన్నీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment