Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లొంగుబాటు..4కేసులు లక్షల్లో రివార్డ్

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మచ్చ సోమయ్య అలియాస్​ సమ్మయ్య (62) ఎట్టకేలకు చిక్కాడు. శనివారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎదుట లొంగిపోయాడు. 32 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సోమయ్యపై 4 కేసులతోపాటు రూ.8లక్షల రివార్డ్ ఉంది. 

New Update
Maoist Maccha Somaiya surrendered

Maoist Maccha Somaiya surrendered

Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మచ్చ సోమయ్య అలియాస్​ సమ్మయ్య (62) ఎట్టకేలకు చిక్కాడు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మొత్తం సోమయ్యపై 4 కేసులతోపాటు రూ.8లక్షల రివార్డ్ ఉంది. ఇక గత 32 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎదుట లొంగిపోవడం సంచలనం రేపింది. 

రైతు కూలీ సంఘంలో పనిచేసి..

ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించిన ఎస్పీ కిరణ్.. మచ్చ సోమయ్య భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందినవాడని తెలిపారు. మావోయిస్టు పార్టీలో జిల్లా కమిటీ సెక్రటరీ, అగ్రికల్చరల్ ఇంచార్జ్‌​గా వ్యవహరించినట్లు తెలిపారు. మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ సెక్రటరీ గాలి ఆగయ్య అలియాస్​ జనార్దన్ ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీలో చేరాడని చెప్పారు. 1990లో రైతు కూలీ సంఘంలో పనిచేస్తున్న క్రమంలో 1992లో భూపాలపల్లి పోలీసులు సోమయ్యను అరెస్టు చేసి జైలుకు పంపిచారు. అనంతరం జైలు నుంచి విడుదలై 1993లో పెద్దారెడ్డి అలియాస్​ వెంకన్న నేతృత్వంలోని మహదేవ్‌పూర్ ఏరియా కమిటీలో చేరి కీలకంగా మారినట్లు ఎస్పీ వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: Athlete: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ!

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్..

సోమయ్య తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడు. మావోయిస్టు పార్టీలో 1995లో ఏరియా కమిటీ మెంబర్ గా పదోన్నతి పొందాడు. ఆ తర్వాత 1998లో మహదేవ్‌పూర్ ఏరియా కమిటీలో కూకాటి వెంకటి అలియాస్​ రమేష్ అలియాస్​ వికాస్ నేతృత్వంలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేశాడు. 2003లో డివిజనల్ కమిటీ మెంబర్ గా పదోన్నతి పొందాడు. మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ కి కార్యదర్శిగా నియమించిన తర్వాత ఉత్తర తెలంగాణలో అణచివేత కారణంగా 2007లో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. 2007లోనే ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి బదిలీ అయ్యాడు. 

ఇది కూడా చదవండి: DK: రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తిక్.. రాయల్స్ తరపున బరిలోకి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment