Crime News: మాస్టారువా.. మృగానివా - 5వ తరగతి విద్యార్థినిపై.. ఛీ ఛీ!

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల టీచర్ రేగుచెట్టు రమేష్‌.. ఐదో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు. పోలీసులు వచ్చి అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

New Update
Mancherial Bhimini mandal primary school teacher sexually abused a fifth-grade student

Mancherial Bhimini mandal primary school teacher sexually abused a fifth-grade student

రోజు రోజుకూ కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులు అని చూడకుండా అత్యంత క్రూరంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి కీచక చర్యలకు పాల్పడుతుండటం అందరిలోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. తల్లి, తండ్రి తర్వాత గురువే ప్రత్యక్ష దైవంలా భావించే చిన్నారులపై కొందరు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. మీరే మా స్ఫూర్తి అని స్టూడెంట్స్ చేత చెప్పించుకోవలసింది పోయి.. వారిచేతే తిట్లు తింటున్నారు, వారిచేతే దెబ్బలు కాస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో చోటుచేసుకుంది.

లైంగిక వేధింపులు

తండ్రి వయసున్న ఓ ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడితో ఆగకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వద్దు వద్దు అన్నా తాకరాని చోట తాకాడు. ఇక జరిగిన విషయాన్ని ఆ బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో అతడి రంగు బయటపడింది. దీంతో ఆ బాలిక తల్లి దండ్రులు పాఠశాలకు వచ్చి అతడిపై దాడికి యత్నించారు. 

Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి

బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగి విధులు నిర్వర్తిస్తున్న రేగుచెట్టు రమేష్‌.. ఐదో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

తాకరాని చోట తాకుతూ

 తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సాయంత్రం ఇంటికెళ్లిన ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు తమ బంధువులతో కలిసి పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు. ఆపై ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Shakeel Arrest:: తల్లి మృతి.. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్ట్!

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన షకీల్‌ ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా  గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి బుధవారం కన్నుమూశారు.

author-image
By Krishna
New Update
shakeel mother

shakeel mother

Shakeel Arrest:

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.  దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన షకీల్‌ ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా  గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి బుధవారం కన్నుమూశారు. గురువారం అచన్‌పల్లిలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.  అయితే తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్‌కు కాగా.. అక్కడికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కాగా కొన్ని నెలలుగా షకీల్‌ దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.  

Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

Advertisment
Advertisment
Advertisment