WhatsApp Treatment: ప్రాణాలతో చెలగాటమాడిన హాస్పిటల్ సిబ్బంది.. వాట్సాప్ వైద్యానికి వ్యక్తి బలి

కోదాడలోని ఓ ప్రైవేట్‌లో హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరావు(48) మృతి చెందాడు. డాక్టర్ లేడని కాంపోడర్లు వైద్యం చేయడంతో వ్యక్తి మృతి చెందాడని బాధిత కుటుంబం సభ్యులు ఆరోపిస్తూ హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు.

New Update
kodada hospitel

kodada hospitel Photograph: (kodada hospitel)

హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో కోదాడ పట్టణంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ ఆన్‌లైన్ ట్రీట్‌మెంట్‌ చేస్తే వైద్యం వికటించింది. హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరావు (48) అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ పరిశీలించి స్కానింగ్, రక్త పరీక్షలు సూచించాడు. టెస్టులు చేయించుకొని తిరిగొచ్చే సరికి డాక్టర్ హాస్పిటల్‌లో లేడు. రిపోర్టులను ఆస్పత్రిలోని కాంపౌండర్లు మొబైల్ వాట్సాప్‌లో డాక్టర్‌కు పంపించారు. టెస్ట్ రిపోర్టులను పరిశీలించిన డాక్టర్ వాట్సప్‌లోనే పలు ఇంజక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయమని సిబ్బందికి చెప్పాడు. దీంతో కాంపౌండర్లు ఇంజక్షన్ చేయడంతో అది వికటించి విరోచనాలతో నాగేశ్వరరావు మృతి చెందాడు. 

Also Read: Zelensky: ట్రంప్‌ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్‌ స్కీ సంచలన వ్యాఖ్యలు!

Also Read :  దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

A Man Dies With WhatsApp Treatment

కానీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం సదరు వ్యక్తికి సీరియస్‌గా ఉందని వేరే హాస్పటల్‌కు తరలించమని బంధువులకు తెలపడంతో వారు పట్టణంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ పరిశీలించి ఏమీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయాడు. కానీ నాగేశ్వరావు కుటుంబ సభ్యులు మొదటి ఆస్పత్రిలోని సిబ్బంది ఇచ్చిన ఓవర్ డోస్ ఇంజక్షన్ వల్ల మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నాగేశ్వరరావు మృతి చెందాడని.. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

Also Read :   iPhone 16e: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే ఛాన్స్.. 16 సిరీస్‌లో 16e మోడల్.. ధర ఇంత తక్కువా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Telangana Crime

Telangana Crime Photograph: (Telangana Crime )

భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హన్ముకొండలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణానికి చెందిన హిమబిందు(34)ను ఎల్కతుర్తి మండలానికి చెందిన శ్రీరామోజు రమేశ్​ చారికి ఇచ్చి 16 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ 16 ఏళ్ల నుంచి రమేశ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వేధింపులు భరించలేక..

ఎన్నో సార్లు గ్రామ పంచాయతీ వరకు వీరి గొడవ వెళ్లింది. అయినా కూడా రమేశ్ ప్రవర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో హిమబిందు రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పంచాయితీ పెట్టి అత్తవారింటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెంది హిమబిందు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇదిలా ఉండగా ఇటీవల వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ నూతన వధువు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Advertisment
Advertisment
Advertisment