TG News: కలెక్టర్‌గా కండక్టర్ కూతురు.. వీణ విజయ రహస్యం ఇదే!

తెలంగాణ గ్రూప్1 పరీక్ష ఫలితాల్లో నారాయణపేట అమ్మాయి వీణ అదరగొట్టింది. మల్టీజోన్ 2లో 3వ ర్యాంక్ సాధించింది. ఆర్టీసీ కండక్టర్ కూతురు అయిన ఆమె స్టేట్ 118 ర్యాంక్ సాధించడంతో తమ కల నెరవేర్చిందంటూ పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

New Update

TG News: తెలంగాణ గ్రూప్1 పరీక్ష ఫలితాల్లో మహబూబ్ నగర్ నారాయణపేట అమ్మాయి వీణ అదరగొట్టింది. మల్టీజోన్ 2లో 3వ ర్యాంక్ సాధించింది. ఆర్టీసీ కండక్టర్ కూతురు అయిన వీణ స్టేట్ 118 ర్యాంక్ సాధించడంతో తమ కల నెరవేర్చిందంటూ పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టు వచ్చే అవకాశం ఉంది.

చిన్నప్పటి నుండి చదువులో నంబర్ 1

ఈ సందర్భంగా RTVతో మాట్లాడిన వీణ తల్లిదండ్రులు.. చిన్నప్పటి నుండి చదువులో వీణ నంబర్ వన్ అని చెప్పారు. చదువుతో పాటు ఇంటి పనుల్లోనూ సాయం చేస్తుందని, చిన్ననాటి నుండి కలెక్టర్ అవుతానంటూ చెప్పేదని, ఈరోజు ఆ కలను నిజం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. 

ఇది కూడా చదవండి: Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!

'మా బిడ్డకు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్టు వచ్చే అవకాశం ఉంది. కండక్టర్ గా పని చేస్తున్న నా కూతురు కలెక్టర్ కాబోతుంది అనే వార్త నాకు ఎనలేని సంతోషాన్ని ఇస్తోంది. RTC నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా డీఎస్పీలు, జాయింట్ కలెక్టర్‌లు హాజరవుతుంటారు. నా కూతురు కూడా అలా ముఖ్య అతిథిగా హాజరయ్యే స్థాయికి ఎదగడం గొప్పగా అనిపిస్తోంది. మా బంధుమిత్రులు, జిల్లావాసుల నుండి పెద్ద ఎత్తున ప్రశంశలు అందుతున్నాయి. ఎన్నడు ఫోన్ కూడా చేయని వారు సైతం ఇప్పుడు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు' అంటూ ఆనందపడిపోతున్నారు. 

ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు.. వరంగల్‌ మహిళా మావోయిస్టు మృతి

 group-1 | telangana | toppers | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Husband attacks wife : కొండాపూర్ లో దారుణం.. గ‌ర్భిణి అయిన భార్యను చంపాలని...

కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది..గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

New Update
Husband attacks wife

Husband attacks wife

Husband attacks wife : కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది.. గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ చావుబ‌తుకుల మధ్య ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!
 
 గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త ఏం జరిగిందో ఏమో గానీ, ఒకసారిగా భార్యమీద దాడి చేశాడు.బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద దాడి చేసిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

పోలీసుల కథనం ప్రకారం… వికారాబాద్‌కు చెందిన ఎండి బస్రత్ (32) బ‌తుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఇంటీరియర్ పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి హఫీజ్ పేట్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్లే క్రమంలో ప్రయాణంలో బస్రత్‌కు కోల్‌క‌తాకు చెందిన షబానా పర్వీన్(22) పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారగా, 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.వివాహం అనంతరం ఇద్దరు హఫీజ్ పేట్ ఆదిత్యనగర్‌లో కాపురం పెట్టగా, బస్రత్ ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తున్నాడు. పెళ్లి అనంతరం మొదట అత్తామామలతో కలిసి ఉండగా, కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి.

 Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 దీంతో బస్రత్, షబానా పర్వీన్‌లు స్థానికంగా వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం షబానా పర్వీన్ రెండు నెలల గర్భిణి కాగా, మార్చి 29న పర్వీన్‌కు వాంతులు కావడంతో కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని సియా లైఫ్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత పర్వీన్‌ను ఏప్రిల్ 1వ తేదీన రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు రావడంతోనే, హాస్పిటల్ ముందే భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఇద్దరి మద్య మాటామాటా పెరగడంతో బస్రత్ ఒక్కసారిగా తన భార్య పర్వీన్ మీద దాడికి తెగబడ్డాడు. నడిరోడ్డు మీద పెనుగులాటలో కిందపడిన భార్య మీద అక్కడే ఉన్న బండరాయితో దాడి చేశాడు. దాదాపు 10 నుంచి 12సార్లు రాయితో మోదడంతో పర్వీన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లింది. చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ ఘ‌ట‌న‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పర్వీన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా పర్వీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న పర్వీస్ ప్రాణాలతో పోరాడుతుంది. పర్వీన్ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడు బస్రత్‌ను ఈనెల 3న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు