హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. నార్సింగి TSPA సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న DCMను గోపినాథ్ కూతుర్లు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మాగంటి పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. రెండో కుమార్తె స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వీళ్లకు AIG ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. హైస్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇంట్లో మరో విషాదం
— Telugu Scribe (@TeluguScribe) March 23, 2026
నిన్న రాత్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మాగంటి గోపినాథ్ కూతురు ప్రయాణిస్తున్న కారుకి రోడ్డు ప్రమాదం
చక్రాలు ఊడిపోయి రోడ్డుపై అడ్డంగా ఉన్న డీసీఎంను ఢీకొనడంతో, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కూతురు అక్షర… https://t.co/gGHqGhXCxIpic.twitter.com/Epcaf1G6lL
Follow Us