/rtv/media/media_files/2024/11/22/AL6nKVIG60TkKkTUhTXK.jpg)
KTR
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏడాదిగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. అనుముల అన్నదమ్ములు, బంధువుల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం కోసం అక్కడికి వెళ్లిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డికి కేటీఆర్ అన్న బంపరాఫర్
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) February 10, 2025
నీకు దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఇక్కడికి రా
మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి.. ఇంట్లోనే కూర్చుంటాడు
50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా pic.twitter.com/WW8QKHARJC
అల్లుడికి కట్నం కింద లగచర్ల భూములు..
ఏడాదిగా కొడంగల్లో కురుక్షేత్ర యుద్ధం నడుస్తోంది. దుర్యోధనుడి పాలనా నడుస్తోంది. ఇక్కడి భూములు గుంజుకోవటం కోసం రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు. పచ్చని పంటలతో కనిపించిన లగచర్లను నాశనం చేయాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతాడా. కొడంగల్ లో రైతు బంధు, రుణమాఫీ రాలేదు. అల్లుడికి కట్నం కింద లగచర్ల భూములు ఇవ్వాలని చూస్తున్నాడు. లగచర్లలో భూములు ఇవ్వం అని పోరాడిన రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు.
దమ్ముంటే రాజీనామా చెయ్..
ఇక లగచర్ల జ్యోతి సివంగిలా పోరాటం చేసిందని కొనియాడారు. ఇదే కార్యక్రమంలో జ్యోతి బిడ్డకు భూమి నాయక్ అని పేరు పెట్టారు రేవంత్. భూమి కోసం పోరాటం చేశారు కాబట్టి ఆ పేరు పెట్టాను. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించటం ఖాయం. ఆయన తన సొంత నియోజక వర్గానికి పోవాల్సిందే. అందరూ సంతోషంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా.. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్. మేము ఎవరం ప్రచారం చేయం. నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే చాలు 50 వేల మెజార్టీ ఖాయం. రేవంత్ రెడ్డి గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
లగచర్ల తండాలో జన్మించిన పాపకు "భూమి నాయక్" అని నామకరణం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/QXDp1rsLzM
— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) February 10, 2025
ఇది కూడా చదవండి: Sheesh Mahal: శీష్ మహాల్కు దూరంగా ఢిల్లీ కొత్త సీఎం
అనుముల అన్నదమ్ముల కోసం, అదానీ కోసం, అల్లుడి కోసమే కొడంగల్ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి కురుక్షేత్ర యుద్దాన్ని తలపించేలా రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నారన్నారు. తన మనుషులకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచిపెట్టడానికే లగచర్ల రైతులపై అక్రమకేసులు బనాయించారని విమర్శించారు.
ఇది కూడా చదవండి: రంగరాజన్ పై దాడి.. పవన్ ఆదేశాలతో రంగంలోకి జనసేన నేతలు.. చిలుకూరుకు వెళ్లి!