BIG BREAKING: హైడ్రాను ఎత్తి చెరువులో పారేస్తాం.. కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ సీనియర్ నేత జీవన్‌ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే హైడ్రాను ఎత్తివేస్తామన్నారు.

New Update
KCR

KCR

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే హైడ్రాను ఎత్తివేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దోపిడి, అరాచకం ఉందంటూ విమర్శించారు. ఇక జీవన్ రెడ్డి గుండె ధైర్యంతో పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 45 ఏళ్లుగా జీవన్‌రెడ్డితో తనకు స్నేహం ఉందన్నారు. జగిత్యాల వ్యాప్తంగా ఆయనకు విశేషమైన జనాధరణ ఉందన్నారు. గతంలో జీవన్‌ రెడ్డి బోర్నపల్లి వద్ద బ్రిడ్జి కావాలని అడిగితే.. రూ.80 కోట్లు నిధులు కేటాయించామని తెలిపారు. అలాగే జీవన్‌రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగిస్తున్నామని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని తెలిపారు. 

'' తెలంగాణ రాకముందు ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉండేవి. తెలంగాణ అనే పదాన్నే అసెంబ్లీలో పలకొద్దన్నారు. మన నీళ్లు, వనరులను దోపిడి చేశారు. కొన్ని పార్టీల తీరు వల్ల ఆవేశం, దుఃఖం వచ్చేది. గంజి కేంద్రాలు పెట్టిన అధ్వాన స్థితికి తెలంగాణను తీసుకొచ్చారు. పాలమూరు లాంటి జిల్లాలో 90 శాతం వలసలే ఉండేవి. రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేవి. కరెంట్ ఛార్జీలపై నిరసనలు చేస్తే కాల్చి చంపేశారు. బషీర్‌బాగ్‌ ఘటనతోనే తెలంగాణ జెండా పట్టుకొని ఉద్యమంలోకి దిగాను. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ సచ్చుడో అంటూ దీక్ష చేశాను. నా దీక్షతో పార్లమెంట్ అల్లకల్లోలమైంది.   

రోశయ్య 14F అనే జీవో తీసుకొస్తే ఉద్యోగ నిరసన చేశాం. తెలంగాణ వచ్చాక అందరిని కలుపుకొని ముందుకెళ్లాం. కాకతీయ రాజుల పేరుతో చెరువులు బాగుచేసుకున్నాం. ఐదేళ్లలోనే మిషన్ భగిరథ పూర్తి చేసి నీళ్లిచ్చాం. కానీ ఇప్పుడు మిషన్ భగీరథకు ఏమైంది. కేసీఆర్‌ చావాలంటూ మాట్లాడుతున్నారు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. పంట పొలాలు ఎండిపోయి ప్రజలు ఏడుస్తున్నారు. వీళ్లు రైతుబంధుకు రాంరాం.. దళిత బంధుకు జై భీం అంటారని చెప్పాను. 1.7 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయాం. రాష్ట్రంలో యూరియా బస్తాలు ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. ఇప్పుడు ఏదో యాప్‌ తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారు.

నేను ఈరోజు సభ పెడుతున్నానని రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేశారు. మళ్లీ ఓ సభ పెడితేనే మూడో విడత నిధులు ఇస్తారా ?.  మేము రూ.73 వేల కోట్ల రైతుబంధు నిధులు ఇచ్చాం.  రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేశారు. గతంలో వైఎస్సాఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకొస్తే దాన్ని నేను కొనసాగించాను. కానీ ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే పరిస్థితులు లేవు.  అన్ని స్కామ్‌లు, కుంభకోణాలు, భూకబ్జాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ రంగంలో కూడా అభివృద్ధి లేదు. మేము  ఉద్యోగులకు 72 శాతం పీఆర్సీ ఇచ్చాం. కానీ ఇప్పుడు 7 శాతం ఇచ్చే పరిస్థితి లేదు.

ఈ ప్రభుత్వం హైడ్రోను తీసుకొచ్చి పేదల ఇళ్లు కూలగొడుతుంది. నిజామాబాద్‌కు నిడ్రా తీసుకొస్తామని పీసీసీ చీఫ్‌ అంటున్నారు. పేదల ఇళ్లు కూల్చేందుకు జగిత్యాలకు జిడ్రా తీసుకొస్తాం అంటారు. మేము అధికారంలోకి వస్తే హైడ్రాను ఎత్తివేస్తాం. మూసీ దగ్గర ఉంటున్న పేదలను ఇబ్బంది పెడుతున్నారు. మూసీని బాగుచేసేందుకు 10 వేల ప్రజలు ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏముంది ?.  యాదవులకు గొర్రెలు లేవు. మత్స్యకారులకు చేపలు లేవు. మళ్లీ తెంలగాణ పునర్నిర్మాణ యజ్ఞం మొదలుపెడతామని'' కేసీఆర్‌ అన్నారు.  

Advertisment
తాజా కథనాలు