KA Paul: నేనే అల్లు అర్జున్‌ని అయితే రూ.300 కోట్లు ఇస్తా

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించారు. అందులో తొలివిడతగా రూ.10 లక్షల్ని అందించారు. ఈక్రమంలో కేఏపాల్‌ అల్లు అర్జున్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
KA Paul: ఈ ఎన్నికలు ఈవీఎంల మాయ.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

ka paul comments on allu arjun

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట  ఘటనతో అల్లు అర్జున్‌పై విమర్శల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చెక్‌ను ఇచ్చారు ‘పుష్ప 2’ చిత్ర నిర్మాతలు. అయితే ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్.. పాతిక లక్షలు, యాభై లక్షలు కాదు.. రూ.300 కోట్లు ఆ కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏంటీ మూడొందల కోట్లే అని మీడియా మిత్రులు ఆశ్చర్యపోవడంతో.. అవునూ మూడొందల కోట్లే.. నేనే అల్లు అర్జున్‌ని అయితే.. ఆ మూడొందల కోట్లే కాదు.. మొత్తం వేల కోట్ల ఆస్తిని పంచేసేవాడిని అంటూ ఎప్పటిలాగే ఆయన తన నోటికి పనిచెప్పారు. 

Also Read: 🔴 Allu Arjun Case Live Updates: మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ విచారణ

ఈ సందర్భంలో కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు . రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పారు. నేను అబద్దాలే మాట్లాడతా.. ప్రజలు అబద్దాలే నమ్ముతారని. ఆయన తాజాగా అసెంబ్లీలో ఏం మాట్లాడారో. . మీరూ విన్నారు. నేనూ విన్నాను. అందులో కొన్ని సత్యాలు ఉండొచ్చు. కొన్ని అసత్యాలు ఉండొచ్చు. కానీ ఆ తరువాత అల్లు అర్జున్ ఎలా మాట్లాడారూ.. మీడియా ముందు నటించారు.

 

అదే నేనే అల్లు అర్జున్ అయితే కనుక.. చనిపోయిన రేవతి అనే మహిళకి లక్ష కోట్లు ఇచ్చినా నేను తిరిగి తీసుకుని రాలేను. అందుకు నన్ను క్షమించాలి. దయచేసి రేవతి భర్త, రేవతి బంధువులు నన్ను క్షమించండి అని ముందు మాట మాట్లాడాలి.నేనే అల్లు అర్జున్‌ని అయితే కనుక.. ఆ సినిమాకి నాకు రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు కాబట్టి రేవతి కుటుంబానికి, హాస్పిటల్‌లో ఉన్న ఆమె కొడుక్కి ఆ మూడొందల కోట్లు ఇచ్చేస్తున్నా అని ప్రకటించేవాడ్ని.

Also Read: Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు!

20 సినిమాలు చేశాను.. ఇంకో ఇరవై చేసి సంపాదించుకుంటాను. ఇప్పటివరకూ సంపాదించిన డబ్బు అంతా పేదలకు పంచేస్తాను. గ్రామాలను అభివృద్ది చేస్తాను అని అనాలి. కానీ అల్లు అర్జున్ అలా మాట్లాడలేదు.నేను వచ్చిందే ఎంటర్‌టైన్మెంట్‌కి నేను చేసిందే మీకొరకు అని అంటాడేంటి? అతనికి వేల కోట్లు ఉన్నాయి. మైహోమ్స్‌లో నీకు భాగస్వామ్యం ఉంది కదా.

Also Read: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే

మైహోమ్స్ అధినేతకి లక్షల కోట్లు ఉంటే.. అల్లు అర్జున్‌కి వేల కోట్లు ఉన్నాయి. రూ.25 లక్షలు ఇస్తానని చెప్పి.. రూ.10 లక్షలు ఇవ్వడం ఏంటి ? కేఏ పాల్ అనే నేను.. ఐదు లక్షల కోట్లు ఇచ్చాను. ప్రపంచ వ్యాప్తంగా. లక్షలాది గృహాలను నిర్మించా నా సొంతడబ్బుతో. నేను ఇంత చేస్తుంటే అల్లు అర్జున్ ఎందుకు చేయడంటూ తనదైన శైలిలో మాట్లాడి మీటింగ్‌ ముగించేశారు పాల్‌. 

Also Read: AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!kap

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు"ప్రభుత్వ" కానుక..ఆనాటి నుంచే…..

భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకులకు ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ ఆనావాయితీ నిజాం పాలన నుంచే అంటే 1890లలో ఆరో నిజాం కాలం నుంచి కొనసాగుతోంది.

New Update
Bhadrachalam Temple

Bhadrachalam Temple

Bhadrachalam Temple : భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకులకు ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఆనావాయితీ ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తర్వాత నుంచే వస్తుందనుకుంటారు. కానీ నిజానికి దీనికి 135 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అంటే నిజాం పాలన నుంచే ఆ ఆచారం కొనసాగుతోంది. 1890లలో ఆరో నిజాం కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
 
భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. మిథిలా మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు. నిజాం కాలం నుంచే మత సామరస్యానికి ప్రతీకగా.. భద్రాచలం రాములవారి కల్యాణానికి సర్కార్ నుంచి కానుకలు అందేవి. 1890లలో హైదరాబాద్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి బృందం ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ తరపున భద్రాచలం ఆలయానికి కానుకలు సమర్పించారు. ఈ సంప్రదాయం కుతుబ్ షాహీలతో ప్రారంభమై నేటికీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా కొనసాగుతోంది. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి నిజాం నవాబులు కానుకలు అందించిన చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు కూడా ఉన్నాయి. నిజాం రాజవంశం, ముఖ్యంగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన దాతృత్వంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా నిలిచారు. ఆయన మత విశ్వాసాలకు అతీతంగా హిందూ, ముస్లిం దేవాలయాలకు, ఇతర సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. భద్రాచలం ఆలయానికి సంబంధించి నిజాం రాజులు ఈ పుణ్యక్షేత్రాన్ని గౌరవించారు. ఆలయ నిర్వహణకు ఆర్థిక సహాయం కూడా అందించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భద్రాచలం ఆలయానికి రూ. 29,999 విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ సొమ్ము ఆ కాలంలో చాలా ఎక్కువ అని దాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగించినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అంతేకాకుండా భక్త రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న ప్రజాధనాన్ని రాములవాడి దేవాలయ నిర్మాణానికి వెచ్చించి గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానాషా చేత ఖైదు చేయబడినప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు రామదాసుకు రుణం తీర్చడానికి రామముద్రలతో బంగారు నాణేలు అందించారని పురాణ కథనం ఉంది. ఈ సంఘటన తర్వాత, తానాషా రామదాసును విడుదల చేసి ఆలయానికి గ్రామాలను దానం చేసినట్లు చెబుతారు. ఈ గ్రామాల ఆదాయం ఆలయ నిర్వహణకు ఉపయోగపడింది. ఆ తర్వాత కాలంలో నిజాం రాజులు భద్రాచలం ఆలయం చుట్టూ ఉన్న భూముల ద్వారా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. అలా మొదలైన ఈ ఆనవాయితీ ఉమ్మడి రాష్ర్టంలోనూ కొనసాగింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment