HYDRAA : మరోసారి హైడ్రా దూకుడు.. బుల్డోజర్లతో గోడలు కూల్చివేత

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ని అల్మాస్‌గూడలో హైడ్రా బుల్డోజర్లు దూకుడు పెంచాయి. అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడి కూల్చివేసింది. అక్కడ ఉన్న బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారికి అడ్డంగా నిర్మించిన అక్రమ ప్రహరీలను తొలగించారు.

New Update
Hydra demolition

Hydra demolition

HYDRAA : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ని అల్మాస్‌గూడలో హైడ్రా బుల్డోజర్లు దూకుడు పెంచాయి. అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడి కూల్చివేసింది. అక్కడ ఉన్న బోయపల్లి ఎంక్లేవ్ కాలనీని పరిశీలించిన హైడ్రా అధికారులు.. అక్కడి రహదారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీలను తొలగించారు.  ఈ ప్రహరీల నిర్మాణం వలన ఇతర ప్లాట్ల యజమానులు తమ ఫ్లాట్లకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో బడంగిపేట మున్సిపాలిటీ అల్మాస్‌ గూడ  విలేజీలోని బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీలను గురువారం తొలగించిన హైడ్రా.

Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు

 లేఅవుట్ లోని దాదాపు సగం ప్లాట్లను కలుపుతూ నిర్మించిన ప్రహారీతో యితర ప్లాట్ల యజమానులకు రహదారులు మూసుకుపోయాయి. అందులో భాగంగా.. హైడ్రా అధికారులు బోయపల్లి ఎంక్లేవ్ కాలనీ లేఅవుట్‌ను సమీక్షించి.. ప్రహరీలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రహరీ 240 గజాల మేరలో నిర్మించబడింది. ఇది కాలనీ భూ యజమానుల మధ్య రహదారికి అడ్డంగా ఉందని గుర్తించాయి. ఈ నిర్మాణం వల్ల ప్రజలకు రోజూ వారి పనులు చేసుకునేందుకు తీవ్ర అసౌకర్యం కలిగింది. హైడ్రా అధికారులు నిర్మాణాలను తొలగించి.. పర్యవేక్షణ చేయగా.. అక్కడి భూ యజమానులతో వాగ్వాదం జరిగింది. లేఅవుట్ ప్రకారం 240 గజాల మేర వుండాల్సిన పార్కును కబ్జాల నుంచి విడిపించిన హైడ్రా.

ఇది కూడా చదవండి: Pastor Praveen: నా భర్త చాలా మంచోడు.. కన్నీరు పెట్టిస్తోన్న ప్రవీణ్ భార్య మాటలు!

వాగ్వాదం కారణంగా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో స్థానిక పోలీసు ఇన్‌స్పెక్టర్ తిరుమలేశ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో రహదారి సమస్యను పరిష్కరించడానికి.. నిర్మాణాలు తొలగించడం పట్ల అభినందనలు తెలిపారు. 1982 గ్రామపంచాయతీ లే ఔట్ వేయగా లేఅవుట్ యజమానులు 3 రహదారుల్లో ఆటంకాలను సృష్టించారు. తాజాగా మూడు చోట్ల రహదారులకు అడ్డుగా కట్టిన ప్రహరీలను హైడ్రా తొలగించింది.

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment