Metro romance: హైదరాబాద్ మెట్రోలో రాసలీలలు.. అడ్డంగా బుక్కైన జంట!

హైదరాబాద్ మెట్రోలో ఓ యువజంట రెచ్చిపోయింది. చైతన్యపురి నుంచి ఎల్బీనగర్ వెళ్లిన ఈ ప్రేమజంట ట్రైన్‌లో అందరిముందే ముద్దుల్లో మనిగిపోయింది. ఒకరినొకరు కౌగిలించుకుని అసభ్యకరంగా తాకిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

New Update
Lovers Romance on Hyderabad Metro

Lovers Romance on Hyderabad Metro

Metro romance: నేటి తరానికి కామం మత్తులో కళ్లు మూసుకుపోతున్నాయి. రహస్యంగా చేయాల్సిన పనిని నడి బజారులో కానిచ్చేస్తున్నారు. కొంతమంది ఇంకా మాలో జంతు ప్రవృత్తి పోలేదని నిరూపిస్తున్నారు. నడి రోడ్లపై అర్ధనగ్న ప్రదర్శనలు చేయడమే కాకుండా.. ఏకంగా రొమాన్స్ కూడా చేసేస్తున్నారు. ముద్దులు, కౌగిలింతలతో కంపరం రేపుతున్నారు. బస్సులు, ఆటోల్లోనే కాదు ఏకంగా భారీగా జనం ప్రయాణించే మెట్రో ట్రైన్లలో కొన్ని జంటలు రెచ్చిపోతున్నాయి. మనుషుల మధ్య ఉన్నామనే విచక్షణ మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే సీట్లు లేక ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు.. ఇలాంటివారి చర్యల వల్ల ట్రైన్ ఎక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లో సోమవారం రద్దీగా ఉన్న ట్రైన్ లో ఓ యువజంట చేసిన పని చూస్తే తిట్టకుండా ఉండలేరు. 

శరీరాలను తడుముకుంటూ దారుణంగా..

ఈ మేరకు చైతన్యపురి స్టేషన్‌లో మెట్రో ఎక్కిన యువ జంట ఎల్బీనగర్ స్టేషన్ వరకు ప్రయాణించింది. అయితే ఎక్కిన కాసేపటికే మెట్రోలో అందరి ముందే రొమాన్స్ మొదలుపెట్టారు. ఎవరు ఏమీ అనకపోవడంతో మరింత రెచ్చిపోయిన కామాంధులు ఏకంగా ముద్దుల్లో మునిగిపోయారు. ఒకరినొకరు కౌగిలించుకుని శరీరాన్ని తడుముకుంటూ దారుణంగా ప్రవర్తించారు. ఇదంతా తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తుండగా.. భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి. 

Also Read: న్యూ ఇయర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు! ఆ దేశ ప్రజలు ఎందుకలా చేస్తారు?

Also Read: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హైదరాబాద్‌లో ఈ నెల 27న ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్’ జరగనుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లేవర్‌ను గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. ఎర్రమంజిల్‌లోని ప్రీమియా మాల్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు పోటీలు జరుగుతాయి.

New Update
ice cream

ice cream

ఐస్‌క్రీమ్ ప్రియులకు ఒక ప్రత్యేకమైన పోటీ వేదిక రాబోతుంది. కళ్లకు గంతలు కట్టుకుని వివిధ రకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తిస్తే చాలు.. ఏకంగా రూ. 3 లక్షల వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం మీ కోసం రెడీ అవుతుంది. ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ మూడవ ఎడిషన్ ఈ నెల 27న ఐస్‌క్రీమ్ అభిమానుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన వివరాలను  ఎర్రమంజిల్‌లోని గలేరియా మాల్‌లో ప్రముఖ హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌, బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతావర్మ,  నటుడు సమీర్‌లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పోటీ  పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ ఆసక్తికరమైన పోటీలో విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేయనున్నారు.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Ice Cream Challenge

మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండవ బహుమతిగా రూ. 50 వేలు,  మూడవ బహుమతిగా రూ. 25 వేలు గెలుచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా.. మరో 25 మంది విజేతలను ఎంపిక చేసి, ఒక్కొ విజేతకు రూ. 5 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు కూడా నిర్వాహకులు ఇవ్వనున్నారు.

 ఈ పోటీలు ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ప్రీమియా మాల్‌లో ఈ నెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ తారలు స్వయంగా కళ్లకు గంతలు కట్టుకుని వివిధ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తించే ప్రయత్నం చేశారు.. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం 8008574747 నెంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐస్‌బర్గ్‌ ఐస్‌క్రీమ్స్ సీఈఓ సుహాస్‌ బి. శెట్టి, ఒక ప్రముఖ తెలుగు ఛానెల్ ఎండీ ఎం. రాజ్‌గోపాల్ , డాక్టర్ జె. సంధ్యారాణి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోటీ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. ఐస్‌క్రీమ్ రుచులను గుర్తించడంలో మీ నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ప్రత్యేకమైన వేదికగా కూడా నిలవనుంది. 

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

hyderabad | ice-cream | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment