fraud: తెలుగు సినిమా పేర్లు చెప్పి రూ.1.34 కోట్లు కొట్టేశాడు

సినిమా ప్రమోషన్లు చేస్తామని నమ్మబలికి శ్రీలంక వ్యక్తిని మోసం చేశాడు ఓ వ్యక్తి. ఇచ్చిన డబ్బుకంటే డబ్బులు ఇస్తాని అని చెప్పి విడతల వారీగా రూ.1.34 కోట్లు తీసుకున్నారు. తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. HYD పోలీసులు కేసు ఫైల్ చేశారు.

New Update
fraud 123

fraud 123 Photograph: (fraud 123)

సినిమా ప్రమోషన్ల బిజినెస్ చేస్తా అని మాయమాటలు చెప్పి కోట్లు కొట్టేశాడు ఓ కేటుగాడు. సీసీఎస్‌లో పోలీసులు విచారణలో విషయమంతా బయటకు తీశారు. హైదరాబాద్‌లో ఛత్రినాక అరుందతి కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి.. తన మిత్రులతో కలిసి తరచూ గోవా వెళ్లొస్తుండేవాడు. ఎప్పటిలాగే 2024 అక్టోబరులో అక్కడి బిగ్‌డాడీ క్యాసినోకు వెళ్లాడు. అందులో శ్రీలంకకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. వారు రిలీస్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలకు ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తుంటామని బాదితుడిని నమ్మించారు. అదే నెలలో ఉదయ్‌రాజ్‌ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌కు రాగా.. బాధితుడు వెళ్లి కలిశాడు. త్వరలో విడుదలకానున్న చిత్రానికి ప్రమోషన్‌ చేసేందుకు అవకాశం వచ్చిందని ఉదయ్‌రాజ్‌ చెప్పాడు. OG సినిమా డైరెక్టర్‌ సుజిత్‌ ఫొటోలను చూపి నమ్మకం కలిగించాడు.

ఇది కూడా చూడండి: Champions Trophy:  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..

హైదరాబాద్ వచ్చిన ఉదయ్ రాజ్‌ను వాట్సాప్ ద్వారా కలుసుకున్నాడు బాధితుడు. అమరన్‌ సినిమా ప్రమోషన్‌కు రూ.20 లక్షలిస్తే వారం రోజుల్లో రెట్టింపు లాభాలిస్తామంటూ హామీనిచ్చారు. రెండు దఫాలుగా ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాల నుంచి.. అమరన్‌ సినిమాలో లాభాలు వచ్చాయంటూ రూ.25లక్షలు ఇచ్చారు. సరే డబ్బులు తీసుకొని ఇస్తున్నారు కదా అని బాధితుడి మరోసారి కూడా పెట్టుబడి పెట్టాడు. తరువాత సీతాపయనం, యూఐ, కంగువా, పుష్ప-2, గేమ్‌ఛేంజర్‌ సినిమాల ప్రమోషన్‌ పెట్టుబడి పేరిట ఆన్‌లైన్‌లో రూ.76 లక్షలు, విడతల వారీగా రూ.58 లక్షలు తీసుకున్నారు. బాధితుడు ఉప్పుగూడలోని ఇంటిని విక్రయించడంతోపాటు నగలు తాకట్టుపెట్టి, అప్పులు చేసి మొత్తం రూ.1.34 కోట్లు పెట్టుబడిగా వారికి ఇచ్చాడు. లాభాలు కాదు కదా.. అసలు కూడా ఇవ్వకుండా ఉదయ్‌రాజ్ తప్పించుకు తిరుగుతున్నాడు. మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.  

ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sisters commit suicide : ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు ...

సికింద్రాబాద్ ఖార్ఖానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో పురుగులమందు తాగి అక్కాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా వారు విగతజీవులుగా పడి ఉన్నారు. 

New Update
suicide

suicide

Sisters commit suicide : సికింద్రాబాద్ పరిధిలోని ఖార్ఖానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో పురుగుల మందు తాగి అక్కాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు తెరిచి చూడగా.. అక్కాచెల్లెలు విగతజీవులుగా పడి ఉన్నారు. 

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

 

మృతులను వీణ, మీనాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మానసిక స్థితి బాగలేకపోవడమే ఆత్మహత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. వీనా, మీనాల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Also Read :  రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment