Habsiguda: హబ్సిగూడలో తగలబడుతున్న కార్.. డ్రైవర్‌కు ఏమైందంటే?

హబ్సిగూడ‌లో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారును నిలిపివేసి బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తాకు సమీపంలో ఇది జరిగింది.

New Update
Hyderabad Ghatkesar car fire accident Three burnt alive

Hyderabad Habsiguda car caught fire

హైదరాబాద్‌లోని హబ్సిగూడలో దారుణమైన ప్రమాదం జరిగింది. ఒక కారు మంటల్లో బూడదైపోయింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు నిలిపి.. వెంటనే అందులోంచి బయటకు వచ్చేశాడు. ఎలగో అతడు ముందుగా గమనించి బండి దిగడంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

కాగా ఆ కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తా రాకముందు ఈ ఘటన సంభవించింది. ఇక వెంటనే సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సమాచారాన్ని అందుకుని హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ రోడ్డులో ఏర్పడిన ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలో పడ్డారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ దేవుని దయవల్ల ఏం జరగలేదని మాట్లాడుకుంటున్నారు. 

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

USలో తెలంగాణ వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడంతో టేకులపల్లి గ్రామం శోకసద్రంలో మునిగిపోయింది.

Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు 

హైదరాబాద్‌‌లోనూ ప్రమాదం..

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం రోడ్డుపై వేగంగా వెళ్తు అదుపు తప్పడంతో మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిచారు. కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులోనే కారు నడిపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. కృష్ణానగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు