Hyderabad: భార్యను చంపి ముక్కలుగా కోసి, కుక్కర్లో ఉడకబెట్టి, చెరువులో పారేసిన భర్త

రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి ఊడికించాడు. ఆ తర్వాత వాటిని చెరువులో పడేశాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Husband Kills Wife in Meerpet, Hyderabad

Husband Kills Wife in Meerpet, Hyderabad

రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి ఊడికించాడు. ఈ క్రూరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురుమూర్తి(45) అనే వ్యక్తి జనవరి 18న తన భార్య వెంకట మాధవి(35) కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.   

Also Read: ఐటీ రైడ్స్‌పై స్పందించిన దిల్‌రాజు.. ఏమన్నారంటే..?

అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే గురుమూర్తిని వారు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటపడింది. తన భార్య వెంకట మాధవిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశానని.. ఆ తర్వాత కుక్కర్‌లో ఉడికించానని చెప్పారు. అనంతరం వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే గురుమూర్తి చెప్పిన విషయాలపై పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మృతదేహం ఆనవాళ్ల కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారో తెలుసా ?

అయితే గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత రిటైరయ్యారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం ఇతడికి వెంకటమాధవితో పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు సంతానం. వెంకటమాధవి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలో మరిన్ని వివరాలు బయటపెడతామని మీర్‌పేట పోలీసులు వెల్లడించారు. 

Also Read: గుడ్‌న్యూస్‌.. ఏఐ సాయంతో 48 గంటల్లో క్యాన్సర్‌కు వ్యాక్సిన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment