Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. తన బాబాయి కొమరం రాముడు చేతబడి చేయడం వల్లే తన ఇంట్లో వారు వరుసగా ఏదోకారణం చేత మృతిచెందుతున్నారని అనుమానం పెంచుకుని హత్య చేశాడు.

New Update
 A young man murdered his own uncle

A young man murdered his own uncle

 TG Crime :  ఖమ్మంలో అమానుష ఘటన జరిగింది. భద్రాధ్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. తన బాబాయి కొమరం రాముడు చేతబడి చేయడం వల్లే తన ఇంట్లో వారు వరుసగా ఏదోకారణం చేత మృతిచెందుతున్నారని అనుమానం పెంచుకున్న కొమరం వెంకటేష్.. సొంత బాబాయి కొమరం రాముడిని హత్యచేసేసేందుకు పథకం రచించాడు. గత నెల 11వతేదీన భార్య కొమరం లక్ష్మీదేవితో కలసి కొమరం రాముడు అదే గ్రామంలోని బంధువుల పెళ్లికి వెళ్లాడు.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!


 పథకం ప్రకారం మద్యం ఆశచూపి కొమరం రాముడిని గ్రామ శివారులోని చెరువు కట్టకు రప్పించాడు కొమరం వెంకటేష్. మద్యం మత్తులో ఉన్న కొమరం రాముడిని తన బామ్మర్థి బద్దం బాలరాజు సాయంతో వైరుతో గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని గన్నీసంచిలో కూర్చి చెరువులో పడేశారు. అయితే పెళ్లికి తనతో వచ్చిన భర్త కనిపించకపోవడంతో అంతటా వెతికిన భార్యకు జాడ తెలియలేదు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ గత నెల 16వ తేదీన దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భార్య కొమరం లక్ష్మీదేవీ. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు, కేసు నమోదు చేసిన మూడు వారాల్లో దుమ్ముగూడెం సీఐ అశోక్ మిస్సింగ్ కేసు మిస్టరీని చేధించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో  గ్రామస్థుల సాయంతో మృతుడు కొమరం రాముడి మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీయించారు.  మిస్సింగ్ కేసును హత్యకేసుగా మార్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం భధ్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

 

Advertisment
Advertisment
Advertisment