TGSRTC: తెలంగాణ ఆర్టీసీకే టోకరా.. రూ.21 కోట్ల మోసం

గో రూరల్ ఇండియా సంస్థ.. తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఆర్టీసీ ఇవ్వకుండా నిర్వాహకులు సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. దీంతో TGSRTC రూ.21 కోట్లు మోసపోయినట్లు ఈడీ అధికారులు గుర్తంచారు.

New Update
TGSRTC

TGSRTC

గో రూరల్‌ ఇండియా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అటాచ్ చేశారు. ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. అయితే ఈ గో రూరల్ ఇండియా సంస్థ.. తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ప్రకటనలకు గో రూరల్ ఇండియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే యాడ్స్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా వేరే సంస్థలకు ఇచ్చినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.  M/s GRIPL, M/s Poster Town India Pvt Ltd, M/s Go Transit Media Pvt Ltd, M/s Lime Lite Advertising Pvt Ltd లాంటి కంపెనీల ద్వారా వ్యాపారం చేసినట్లు గుర్తించారు.

Also Read: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన

వినియోగదారుల నుంచి వచ్చిన కోట్లాది రూపాయలను తమ సొంత ఖాతాల్లోకే మళ్లించుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.21.72 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఆ డబ్బును వివిధ పెట్టుబడులకు ఉపయోగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా ఈ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. 

Also Read: పంజాబ్‌కే అక్రమ వలసదారులను అమెరికా ఎందుకు పంపిస్తోంది ?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : బెట్టింగ్ భూతానికి యువకుడు బలి..

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొంతమంది. వ్యసనంగా మారి మరికొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఏం చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది.

New Update
A young man falls victim to the betting craze..

A young man falls victim to the betting craze..

IPL Betting: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొంతమంది. వ్యసనంగా మారి మరికొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఏం చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ఓ యువకుడు బెట్టింగ్ లో సర్వం పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!
 
ఒకవైపు రోజు మీడియాలో బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న అనర్థాలను చూస్తున్నప్పటికీ యువత ఆ మార్గం నుంచి బయట పడడం లేదు. బెట్టింగ్ యాప్స్ బారిన పడి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఈజీ మనీ ఆశతో చాలా మంది డబ్బులు, ఆస్తులు పొగొట్టుకొని, ఆర్థిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ యువకుడు బెట్టింగ్ కారణంగా అన్ని పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్నాడు. గణేష్ అనే 26 ఏళ్ల యువకుడు మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఏ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గణేష్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: వంటలో ఈ మూడు పదార్థాలు వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు
 
క్రికెట్ బెట్టింగ్ కారణంగానే గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గణేష్ లోన్ యాప్స్, ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేసి బెట్టింగ్ లు పెట్టేవాడని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం కూడా అతడి సూసైడ్‌కు కారణాలని పోలీసులు అంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

Advertisment
Advertisment
Advertisment