Basara: కొద్ది రోజుల్లో పెళ్లి ఒత్తిడి తట్టుకోలేక నదిలో దూకిన కుటుంబం!

నిజామాబాద్ లో నివాసముంటున్న ఉప్పలించి వేణు కుటుంబం వడ్దీ వ్యాపారుల నుంచి రూ.3లక్షలు అప్పు తీసుకుంది. ఆపై కూతురికి పెళ్లి సంబంధం ఖాయం అయింది. అదే సమయంలో మొత్తం డబ్బు చెల్లించాల వ్యాపారులు వేధించడంతో ఆ కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది.

New Update
family jumped in basara Godavari river

ఇటీవలే చిన్న కుమార్తెకు పెళ్లి చూపులు జరిగాయి. నిశ్చితార్థం కూడా అయిపోయింది. మరికొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ క్రమంలో కొందరు ఆ కుటుంబం వేధింపులు మొదలు పెట్టారు. భార్య, కూతురిని విడిచిపెట్టమని.. అందరిలో వివస్త్రలను చేస్తాం అంటూ వేధించారు. వారి వేధింపులు తాళలేక ఆ కుటుంబం మొత్తం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య ప్రాణాలతో బయటపడింది. ఇక పెళ్లిపీటలెక్కాల్సిన కూతురు గల్లంతు అయింది. అయితే మరి ఆ కుటుంబాన్ని ఎవరు వేధించారు? ఎందుకు వేధించారు? అనే విషయానికొస్తే.. 

Also Read : ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా

బతుకుదెరువు కోసం నిజామాబాద్ వచ్చారు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురుకు చెందిన ఉప్పలించి వేణు(54) - భార్య అనూరాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఈ కుటుంబం ఇరవై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నిజామాబాద్ కు వచ్చారు. న్యాల్ కల్ రహదారి పక్కన కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఒక పాన్ షాప్ కూడా ఉంది. అనంతరం పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. కానీ నాలుగేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇక అప్పటి నుంచి చిన్న కుమార్తెను ముద్దుగా చూసుకున్నారు. ఇక వీరికున్న పాన్ షాప్ మొదటిగా బాగానే నడిచింది. కానీ అంతకంతకు తగ్గుతూ వచ్చింది. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. 

Also Read : సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్!

అదే సమయంలో స్థానికంగా ఉండే వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు. ఓ రోజు మొత్తం డబ్బు చెల్లించాలంటూ అప్పులిచ్చిన వారు ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారు. కొంత సమయం కావాలని ఆ కుటుంబం వేడుకున్నా వదిలి పెట్టలేదు. తరచూ వేధింపులకు పాల్పడ్డారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే భార్య, కూతురిని విడిచిపెట్టమని.. అందరిలో వివస్త్రలను చేస్తాం అంటూ బెదిరించారు.  

Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్

తన చిన్న కుమార్తె పూర్ణిమకు పెళ్లి చూపులు కూడా జరిగాయని.. కొద్ది రోజుల్లో అప్పు మొత్తం తీర్చేస్తామని వేడుకున్నారు. కానీ వడ్డీ వ్యాపారులు వినలేదు. దీంతో మనస్థాపానికి గురైన వేణు, భార్య అనూరాధ, కుమార్తె పూర్ణిమ కలిసి బుధవారం వేకువజామున బాసరకు వచ్చారు. ఆపై గోదావరి బ్రిడ్జ్ పై నుంచి నదిలో దూకేశారు. దీంతో అనూరాధ నీటి ప్రవాహానికి స్నానాలఘాట్ వరకు కొట్టుకొచ్చింది. గమనించిన కొందరు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. 

Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని చెప్పగా.. ఆమె భర్త వేణు, కూతురి పూర్ణిమ కోసం గాలించగా వేణు మృతదేహం లభ్యమైంది. పూర్ణిమ గల్లంతు కావడంతో ఆమెకోసం గాలిస్తున్నారు. మరోవైపు అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HYD: హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

New Update
ed

హైదరాబాద్ లో సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈ డీ అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ కంపెనీల ఛైర్మన్ నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళల్లో, ఆఫీస్ుల్లో తనిఖీలు నిర్వహించింది. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారన్న అనుమానంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. నాలుగు గంటలకి ఈడీ దాడులు చేశారు. మొత్తం రెండు టీములతో ఈడీ సోదాలు చేసింది. బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి.

రుణాలు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు..

సురానా గ్రూపు చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను పొందింది. కానీ వాటిని చెల్లించకుండా రుణాలను ఎగ్గొట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో పాటూ మనీలాండరింగ్తో పాటు విదేశాలు డబ్బులు తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకు ముందు సురానా గ్రూప్స్ పై సీబీఐ కేసు కూడా నమోదైంది. ఈ కారణంగానే సురానా అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలప్ మెంట్స్ కంపెనీ  ఆఫీసుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల ఆర్థిక లావాదేవీలు, అప్పులు లాంటి వాటిపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.

 today-latest-news-in-telugu | ed | hyderabad | raids 

Also Read: AP: విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్..99పైసలకే భూమి లీజు

Advertisment
Advertisment
Advertisment