Summer:ఎండలు ముదురుతున్నాయి..జాగ్రత్త!

ఈ సారి ఫిబ్రవరి చివరివారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను చేరుకుంది. తెలంగాణలోని 301 మండలాల్లో హీట్‌ వేవ్స్‌ నమోదవ్వడంతో పాటు,వడగాలుల ముప్పు సైతం పొంచి ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

New Update
heatwave

heatwave Photograph: ( heatwave)

నిప్పులు చెరిగే ఎండలు, తీవ్ర వడగాలులతో ఈ వేసవిలోనూ సూర్యుడి భగభగలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనట్లుగా ఈ సారి ఫిబ్రవరి చివరివారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను చేరుకుంది. రాష్ట్రంలోని 301 మండలాలు హీట్‌ వేవ్స్‌ నమోదయ్యే ప్రాంతంలో ఉన్నాయని,వడగాలుల ముప్పు సైతం పొంచి ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది.

Also Read:Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

తెలంగాణ ప్రాంతం మెట్ట నేలలతో ఉండటంవల్ల  భూమి త్వరగా వేడెక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ భూములు ఎక్కువగా ఉండటంతో అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దక్షిణ తెలంగాణలోని కొన్నిజిల్లాల్లోనూ ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి.

Also Read: BIG BREAKING: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?

రాజస్థాన్‌ నుంచి గాలులు..

వేసవిలో రాజస్థాన్‌ నుంచి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటమూ వేడి పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు  సాధారణం  కన్నా  4.5 డిగ్రీల నుంచి 6.4డిగ్రీల వరకు పెరిగినప్పుడు ,ఉష్ణోగ్రత 45 డిగ్రీలను దాటినప్పుడు దానిని హీట్‌ వేవ్‌ గా చెబుతారు.

ఈ జోన్‌ లో ఆదిలాబాద్‌,నిర్మల్‌ , జగిత్యాల,కుమురంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల,పెద్దపల్లి, కరీంనగర్‌,వరంగల్‌,మహబూబాబాద్‌, ములుగు,ఖమ్మం,సూర్యాపేట,నల్గొండ జిల్లాలు ఉన్నాయి.

రాష్ట్రంలో అత్యంత తీవ్ర వడగాలులు ముప్పున్న ప్రాంతాల్లో 9.98 లక్షల మంది తీవ్ర ముప్పున్న ప్రాంతాల్లో 50.64 లక్షల ,ముప్పున్న ప్రాంతాల్లో 1.06 కోట్ల మంది జీవిస్తున్నట్లు  అధికారులు తెలిపారు.రాష్ట్రంలో దశాబ్ద కాలంలో వడదెబ్బతో 1,403 మంది మృత్యువాత పడ్డారు.

2015లో అత్యధికంగా 541 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుబయట పని చేసే కూలీలకు కార్మికులకు ,ప్రయాణాలు చేసేవారికి, వృద్దులకు, మూత్రపిండాల వ్యాధుల  బాధితులకు వడదెబ్బ ముప్పు ఎక్కువ.

Also Read:Tahawwur Rana: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

Also Read: VIRAL VIDEO: ఇదెక్కడి అరాచకం.. బట్టలు విప్పి విమానంలో రచ్చ రచ్చ చేసిన మహిళ.. వీడియో చూశారా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

తెలంగాణలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం మద్యం కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇప్పటివరకు 92 మద్యం సరఫరా కంపెనీలు 604 కొత్త బ్రాండ్లకు అనుమతి కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి.

New Update
liquor

తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ తాజాగా వెల్లడించింది. సంవత్సర కాలంలో సుమారు రూ.35 వేల కోట్ల ఆదాయం.. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు చేకూరిందంటే.. లిక్కర్ అమ్మకాలు తెలంగాణలో ఏ రేంజ్‌లో నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ప్రభుత్వం కొత్త బ్రాండ్లను ఆహ్వానించిన నేపథ్యంలో.. దేశీయ, విదేశీ మద్యం కంపెనీల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వందల సంఖ్యలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

కాదా.. మద్యం అమ్మకాల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని సమాచారం. మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లకు అమ్మకాల అనుమతులు కోరుతూ 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ దరఖాస్తుల సంఖ్య చూస్తేనే.. తెలంగాణలో లిక్కర్ అమ్మాకల్లో పోటీ ఏ స్థాయికి చేరింది అన్నది ఇట్టే తెలిసిపోతుంది. 

Also Read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం మేరకు.. ఇప్పటివరకు వచ్చిన ఈ దరఖాస్తుల్లో 331 బ్రాండ్లు దేశీయంగా తయారయ్యే ఇండియన్ మెడ్ లిక్కర్ కు చెందినట్టుగా తెలుస్తోంది. అంటే దేశీయ బ్రాండ్లకు తెలంగాణ రాష్ట్రం కీలక మార్కెట్‌గా మారుతోందని స్పష్టమవుతోంది. స్థానికంగా తయారయ్యే మద్యం బ్రాండ్లకి వాణిజ్యంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు.. 273 బ్రాండ్లు విదేశీ మద్యం కు చెందినవిగా తెలుస్తోంది. గ్లోబల్ లిక్కర్ కంపెనీలు తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశించి తమ ఉనికిని పెంచుకునేందుకు ఆసక్తిగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలో స్పీడ్‌గా ఎదుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఉంది. దీంతో విదేశీ కంపెనీలు ఇక్కడ తమ బ్రాండ్లకు మార్కెట్ ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాయి.

ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 47 కొత్త కంపెనీలు 386 బ్రాండ్లకు అనుమతులు కోరినట్టు సమాచారం. అలాగే 45 పాత కంపెనీలు 218 బ్రాండ్లకి అనుమతులు కోరినట్టు తెలుస్తోంది. వెల్లువలా వస్తున్న దరఖాస్తులను చూస్తుంటే.. కొత్త కంపెనీలు కూడా తెలంగాణ లిక్కర్ మార్కెట్లో స్థానం సంపాదించేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నాయో తెలుస్తోంది.

అయితే.. తెలంగాణలో మద్యం అమ్మకాలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్నాయి. కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వానికి లిక్కర్ నుంచి వచ్చే ఆదాయం ప్రధాన వనరుగా గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.అయితే.. ఈ కొత్త బ్రాండ్ల అనుమతుల ప్రక్రియకు సంబంధించి అధికారుల పరిశీలన, నియంత్రణ చర్యలు కీలకంగా మారనున్నాయి. అప్రామాణిక బ్రాండ్లు, నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావాటాన్ని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Also Read:Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

liquor | telangana | telangana liquor sales | telangana-liquor-shops-tenders | telangana liquor production increase | latest-news | telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment