/rtv/media/media_files/2026/06/04/ebola-2026-06-04-12-01-22.jpg)
Ebola scare at Shamshabad airport
BIG BREAKING: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం సృష్టించింది. సుడాన్ దేశానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ చేరుకోగా, అతడికి గతంలో ఎబోలా సోకిన హిస్టరీ (చరిత్ర) ఉన్నట్లు విమానాశ్రయ స్క్రీనింగ్ అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయ వర్గాలతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా వైరస్ కలకలం
— RTV (@RTVnewsnetwork) June 4, 2026
గతంలో ఎబోలా సోకిన హిస్టరీ ఉన్న సుడాన్ దేశస్థుడు మహమ్మద్ గుర్తింపు
ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం సుడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహమ్మద్
అధికారులు అప్రమత్తమై అతడిని గాంధీ ఆస్పత్రి ప్రత్యేక గదికి తరలింపు#ShamshabadAirport#EbolaAlert… pic.twitter.com/RORnr3T5Ye
చికిత్స కోసం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చే క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన సదరు ప్రయాణికుడి మెడికల్ రికార్డులను, అంతర్జాతీయ ప్రయాణ నిబంధనల ప్రకారం హెల్త్ డెస్క్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లోనే అతనికి గతంలో ఎబోలా వైరస్ సోకినట్లు తేలడంతో, ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయ అధికారులు తక్షణమే ప్రత్యేక ప్రోటోకాల్ను అమలు చేశారు.
అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన అంబులెన్స్ ద్వారా సదరు సుడాన్ పౌరుడిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి అత్యవసర కేసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ (ప్రత్యేక) గదిలో అతడిని ఉంచి, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం అతడికి వైరస్ యాక్టివ్గా ఉందా లేదా అనేది నిర్ధారించడానికి అవసరమైన నమూనాలను సేకరించి తదుపరి పరీక్షల కోసం పంపినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. విదేశాల నుంచి, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం గత చరిత్ర (పాస్ట్ హిస్టరీ) ఆధారంగానే ముందుజాగ్రత్తగా ఐసోలేషన్కు తరలించామని, పరిస్థితి పూర్తిగా అధికారుల అదుపులోనే ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
Follow Us