NEW YEAR 2025: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..!

న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ.. యువకులు హల్‌చల్ చేశారు.

New Update
new year Drunken drive test

new year Drunken drive test

న్యూ ఇయర్ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మద్యం ప్రియులు చుక్క ముక్కతో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. పార్టీలు, పబ్బులంటూ పీకలమొయ్య తాగి తూలారు. అదే తరుణంలో నూతన సంవత్సరం వేళ ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. 

Also Read: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!

రోడ్లపై హాల్ చల్

రోడ్లపై బారికేడ్లు పెట్టి ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎంతో మంది మద్యం ప్రియులు పట్టుబడ్డారు. రోడ్లపై వాహనాలత విన్యాసాలు చేస్తూ యువకులు హాల్ చల్ చేశారు. అదే సమయంలో పట్టుబడ్డ మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

రోడ్లపై రచ్చ రచ్చ చేసిన మందు బాబులను పోలీసులు పట్టుకోగా.. వారు మారం చేశారు. వదులుతారా? లేదా? అంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయించడానికి పోలీసులు ప్రయత్నించగా.. మందుబాబులు రచ్చ రచ్చ చేశారు. ఎంత చెప్పినా వినలేదు. ముగ్గురు నలుగు పోలీసులు కలిసి వారితో టెస్ట్ చేయించారు. 

Also Read: ఏపీలో పలువురు ఐఏఎస్‌,ఐపీఎస్‌ లకు పదోన్నతులు!

అలాగే ఇంకొందరు కూడా పోలీసులకు అస్సలు సహకరించలేదు. వెహికల్స్ ఆపి చెక్ చేయగా.. పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని ఎలా ఆపుతారు అంటూ పోలీసులతో గొడవకు దిగారు. ఇంకొందరు మాత్రం న్యూ ఇయర్ ఒక్కరోజే తాగుతున్నాం సర్ అంటూ పోలీసులతో రిక్వెస్ట్‌గా మాట్లాడారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Hyderabad Skywalks4

Hyderabad

Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంటనే హైఅలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

ఈ నగరాల్లోనే..

ఉగ్రవాదుల ఎక్కువగా మెట్రో నగరాలు, జనాభా అధికంగా ఉన్న దగ్గర దాడులు చేస్తారు. గతంలో ముంబైలో వరుస పేలుళ్లు, హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల వంటి ముష్కర దాడులను ఇంకా జనం మర్చిపోలేదు. ఈనేపథ్యంలోనే తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశమున్నట్లుగా అంచనా వేశారు.

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. 

Advertisment
Advertisment
Advertisment