Telangana: సన్నబియ్యం పథకం ప్రారంభం.. కొత్తగా 10 లక్షల రేషన్‌కార్డులు జారీ!

రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు.

New Update
 CM Revanth launches fine rice distribution scheme

CM Revanth launches fine rice distribution scheme

తెలంగాణవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీళ్లు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు.  

Also Read: హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. అసలేంటీ వివాదం ?

 ఇదిలాఉండగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కూడా సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలు పంచుకున్నారు. రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం ప్రజలు నివసించే నగరం కాదు.. పెట్టుబడుల నగరమని అన్నారు.  లక్షలాది మందికి ఉపాధి అందించేలా దీని నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు. 2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.

Also Read: మయన్మార్‌ మళ్లీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు

Also Read: మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!

 telugu-news | rtv-news | telangana-news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lrs Concession Offer : గుడ్‌న్యూస్‌.... ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరో నెల పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) రాయితీ గడువును పొడిగించింది. ఏప్రిల్ 30వరకు అవకాశం కల్పించింది. గత నాలుగేళ్లుగాపెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

New Update
LRS registration

LRS registration Photograph: (LRS registration)

Lrs Concession Offer : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) రాయితీ గడువును పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. మొదట మార్చి 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఆ లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం మేర రాయితీ ప్రకటించారు. అయితే ఈ గడువు ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

అయితే రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా ఆశించినంత మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్న మేర స్పందన కూడా రాలేదు. దీనిలో భాగంగానే.. మరో సారి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగించింది. ఇప్పటి వరకు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకు ఫీజు చెల్లించారు. పథకం అమలు తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. దీనిని అధికారులు పరష్కరించేలోపే గడువు తేదీ సమీపించింది. దీంతో పాటు వరుసగా ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో చివరి రెండు రోజులు కార్యకలాపాలు సాగలేదు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తడంతో.. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఓటీఎస్‌ను మరో నెల రోజులు పొడిగించింది.

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!


2024-25 ఆర్థిక సంవత్సరం చివరి రోజున అంటే మార్చి 31న 43,700 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీజు చెల్లించారు. ఆ ఒక్క రోజే ఫీజు కింద దాదాపు రూ.124 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారాలు తెలిపారు. అయితే ఈ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోగా.. ఏప్రిల్ 1వ తేదీన కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీని వర్తింపజేశారు.

ఇది కూడా చదవండి: చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు

Advertisment
Advertisment
Advertisment