Malla Reddy: మాజీమంత్రి మల్లారెడ్డికి బిగ్‌షాక్...అల్లునిపై చీటింగ్‌ కేసు

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజన్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌కు ఇవ్వాల్సిన రూ.20లక్షలు ఇవ్వకుండా మోసం చేశారంటూ రాజశేఖర్‌పై  యేసుబాబు అనే వ్యక్తి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
Malla Reddy

Malla Reddy

Malla Reddy: మాజీమంత్రి మల్లారెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజన్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌కు ఇవ్వాల్సిన  రూ.20లక్షలు ఇవ్వకుండా మోసం చేశారంటూ మర్రి రాజశేఖర్‌పై  యేసుబాబు అనే వ్యక్తి  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విజన్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీస్‌ ద్వారా రాజశేఖర్ రెడ్డికి చెందిన అరుంధతి హాస్పిటల్‌కు 40మంది సిబ్బందిని కేటాయించేందుకు యేసుబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

కాగా 40 మంది సిబ్బందికి గాను రూ.50లక్షలు ఇచ్చేందుకు అంగీకరించిన రాజశేఖర్ రెడ్డి. ఈ మేరకు యేసుబాబు 40 మంది సిబ్బందిని నియమించాడు.అయితే పలు ధపాలుగా రూ.30 లక్షలు చెల్లించిన రాజశేఖర్‌ రెడ్డి మిగిలిన రూ.20 లక్షల కోసం అడిగితే స్పందించడం లేదంటూ యేసుబాబు ఫిర్యాదు చేశాడు. ఎన్నిసార్లు డబ్బులు అడిగిన స్పందించకపోవడంతో డబ్బులు ఇవ్వడం లేదంటూ  యేసుబాబు పోలీసులను ఆశ్రయించాడు.

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

BNS చట్టం ప్రకారం చీటింగ్ కేసు

యేసుబాబు ఫిర్యాదు మేరకు రాజశేఖర్ రెడ్డిపై BNS చట్టం ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. పోలీస్‌ స్టేషన్‌లో 316/2,318(4) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.కేసులో నేరం రుజువైతే 5ఏళ్లు శిక్ష విధించే అవకాశం ఉంటంటున్న పోలీసులు. కాగా గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా  మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

Also Read: VIRAL VIDEO: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment