Batti vikramarka: శోకసంద్రంలో భట్టి విక్రమార్క.. గుండె పోటుతో అతను మృతి చెందడంతో!

భట్టి విక్రమార్క శోకసంద్రలో మునిగితేలారు. తన పీఏ తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌‌‌‌ (50) గుండెపోటుతో చనిపోగా కన్నీటి పర్యంతమయ్యారు. ICDS‌‌‌లో సూపరింటెండెంట్‌‌‌‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌‌‌‌ డిప్యూటేషన్‌‌‌‌పై 6ఏళ్లుగా భట్టికి PA‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

New Update
batti vikramarka

Bhatti Vikramarka PA Srinivas dies of heart attack

Batti vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శోకసంద్రలో మునిగితేలారు. భట్టి పర్సనల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌‌‌‌ (50) గుండెపోటుతో చనిపోగా కన్నీటి పర్యంతమయ్యారు. ICDS‌‌‌లో సూపరింటెండెంట్‌‌‌‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌‌‌‌ డిప్యూటేషన్‌‌‌‌పై 6ఏళ్లకు భట్టికి PA‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

batti khammam

సొంత ఇంటిలోనే కన్నుమూత..

ఈ మేరకు ఖమ్మం బైపాస్‌‌‌‌ రోడ్‌‌‌‌లోని టీఎన్జీవోస్‌‌‌‌ కాలనీలో ఆయన సొంత ఇంటిలోనే సోమవారం కన్నుమూశారు. ఖమ్మంలోని భట్టి క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లడానికి ఉదయం సిద్ధమవుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు. శ్రీనివాస్‌‌‌‌ మృతి విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్‌‌‌‌ ముజమ్మీల్‌‌‌‌ ఖాన్‌‌‌‌, సహా పలువురు ప్రముఖులు, ఆఫీసర్లు, టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌‌‌‌ భౌతికకాయానికి నివాళులర్పించారు.

batti pa

ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!

రాత్రి భట్టి విక్రమార్క శ్రీనివాస్‌‌‌‌ ఇంటికి వెళ్లి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన భట్టి శ్రీనివాసరావు నిబద్ధత, నిస్వార్థ సేవలు మరువలేనివని కొనియాడారు. కురవి మండలం సీరోలుకు చెందిన శ్రీనివాసరావు ఖమ్మం కరుణగిరి సమీపాన టీఎన్జీఓస్‌ కాలనీలో స్థిరపడ్డారు. 

ఇది కూడా చదవండి: TG LAWCET Schedule 2025: తెలంగాణ లాసెట్ 2025 షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ  వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది.

New Update
hyd

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రానున్న రెండు రోజులు.. పాటు బుధవారం, శుక్రవారం భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Also Read: Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!

IMD విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో ఏప్రిల్ 9వ తేదీన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అంతేకాకుండా.. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షితమైన చోటుకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. నిన్న హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రానున్న వర్షాల నేపథ్యంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను సూచిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల తర్వాత ఒక్కసారిగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ప్రజలు ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక నిజామాబాద్ జిల్లాలో వాతావరణంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపు ఐదు రోజుల క్రితం ఈ జిల్లాలో బలమైన ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీని ఫలితంగా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే.. వారం రోజుల పాటు చల్లగా ఉన్న వాతావరణం ఆదివారం నుండి మళ్లీ వేడిగా మారుతుంది. గత మూడు రోజులుగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అయితే.. రానున్న వర్ష సూచనతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనపడుతున్నాయి.

వాతావరణ శాఖ ఈ హెచ్చరికల నేపథ్యంలో.. ఆ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తగిన సూచనలు జారీ చేయడంతో పాటు.. సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీ గా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున.. మరమ్మత్తు బృందాలను ముందుగానే సిద్ధం చేశారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

Also Read: Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్‌ చిన్న కుమారుడు!

Also Read: America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

telngana | adilabad | nizamabad | rains | rain-alert | telangana-rain | telangana rain alert | telangana rains today | telangana rains update | telangana rains updates | telangana-rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment