Suryapet crime : సూర్యాపేటలో దారుణం..యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. పట్టణానికి చెందిన రోజా అనే యువతి మరో యువతితో పరిచయం పెంచుకుంది. ఆమె ద్వారా ప్రమోద్, హరీష్‌ అనే యువకులు పరిచయమయ్యారు.

New Update
 Suryapet crime

Suryapet crime

 Suryapet crime : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. హుజూర్‌నగర్‌కు చెందిన రోజా అనే యువతి మరో యువతితో పరిచయం పెంచుకుంది. రోజా ద్వారా ప్రమోద్, హరీష్‌ అనే యువకులు పరిచయం అయ్యారు.నలుగురూ కలిసి సినిమాలు, షికార్లకు తిరిగారు. ఇద్దరు యువకులూ మంచి వాళ్లుగా నటించడంతో సదరు యువతి మోసపోయింది. ఓ రోజు పార్టీ చేసుకుందామని చెప్పిన యువతి, యువకులు.. బాధితురాలిని హుజూర్ నగర్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపానికి తీసుకెళ్లారు. స్నేహం ముసుగులో బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు.స్నేహంగా నటిస్తూ ఆమెకు మద్యం తాగించి మరీ దారుణానికి ఒడికట్టారు. ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ శారీరకంగా, మానసికంగా హింసించారు.  

Also Read: IPL 2025: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ

Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!


ఆపై మత్తులో ఉన్న సదరు యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలోనే బాధితురాలి ప్రైవేటు వీడియోలు, ఫొటోలు తీశారు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి ఇంటి వద్ద వదిలిపెట్టారు. అయితే ప్రైవేటు వీడియోలు తీసిన కామాంధులు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తాము ఫోన్ చేసి పిలిచినప్పుడల్లా రావాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. రాకపోతే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ భయపెట్టారు. అయినా వారు అడిగింది చేసేందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఇద్దరూ కలిసి ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలు కావడంతో వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం మెుత్తం వివరించింది. దీంతో ఇద్దరు యువకులు, వారికి సహకరించిన మరో యువతిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం

Also Read: ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment