TG Love case: ఒకరితో శృంగారం.. మరొకరితో సంసారం: యువకుడి పెళ్లి పెటాకులు చేసిన కాన్ఫరెన్స్ కాల్!

ఆదిలాబాద్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి జీవితాన్ని ఓ ఫోన్ కాల్ తలకిందులు చేసింది. ప్రేయసితో మాట్లాడుతుండగా పెళ్లి చేసుకునే అమ్మాయి కాల్ చేసింది. అది కాన్ఫరెన్స్ కనెక్ట్ కావడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.

New Update
adoilabad love

Adilabad love case

TG Love case: తెలంగాణలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మరో కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి జీవితాన్ని ఓ ఫోన్ కాల్ తలకిందులు చేసింది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్ధమవుతూనే మరోవైపు లవర్‌తో రిలేషన్ పెట్టుకోవడం పెళ్లి పెటాకులు అయ్యేలా చేసింది. రెండు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొనగా ఆ యువకుడు చేసిన ఘనకార్యంతో ఒక్కసారిగా విషాదం నిండుకున్నంత పనైంది. ఈ సంఘటన  ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

చేసుకోబోయే అమ్మాయితో కాకుండా ప్రేయసితో..

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ మండలానికి చెందిన యువకుడికి అదే జిల్లాలో మరో మండలానికి చెందిన యువతితో ఇటీవలే పెళ్లి కుదిరింది. నెల రోజుల కిందట పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. రెండు కుటుంబాల్లో సందడి మొదలైంది. అయితే కాబోయే భర్తతో మాట్లాడేందుకు ఆ యువతి పలుసార్లు ఫోన్ చేస్తోంది. కానీ చేసుకోబోయే అమ్మాయితో కాకుండా ప్రేయసితోనే ఎక్కువగా అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. అయితే ఒకరోజు అనుకోకుండా అడ్డంగా బుక్ అయ్యాడు. 

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ!

ప్రియురాలితో మాట్లాడుతుండగా పెళ్లి చేసుకునే అమ్మాయి కాల్ చేసింది. లవర్ కాల్‌ హోల్డ్‌లో పెట్టి కాబోయే భార్య కాల్ లిఫ్ట్‌ చేశాడు.  బైక్‌పై ఉన్నానని, కాసేపాగి మళ్లీ కాల్‌ చేస్తానని చెప్పాడు. అయితే ఆమె కాల్‌కట్ చేయబోగా అనుకోకుండా అది మెర్జ్‌ అయింది. దీంతో ఇద్దరు యువకులతోపాటు అతను కాన్ఫరెన్సు కాల్‌లో ఉన్నాడు. లవర్ మాట్లాడుతున్న విషయాన్ని గుర్తించి ఆ అమ్మాయి వెంటనే తన ఇంట్లో వారికి చెప్పింది.  ఫోన్ కాల్ రికార్డు చేసి అందరికీ వినిపించింది. ఈ ఘటనతో పెళ్లి రద్దు చేసుకోవడంతోపాటు కట్నం డబ్బులను తిరిగి తీసుకున్నారు.

Also Read: అలా ఎలా చిక్కావమ్మా.. ఒక్క వాట్సాప్‌ కాల్‌తో టీచర్‌ నుంచి రూ.78 లక్షలు మింగేసిన కేటుగాళ్లు!

phone-call | marriage | lover | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment