సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ.. ఎందుకో తెలుసా ?

సీఎం రేవంత్‌ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతమ్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్‌.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును అందించింది.

New Update
gautam adani

సీఎం రేవంత్‌ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతన్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్‌.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును అందించింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో స్కిల్ యూనివర్సిటీకి నిర్మాణం జరుగుతోంది. ఆగస్టు 1న దీనికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

పెట్టుబడులకు సిద్ధంగా అదానీ గ్రూప్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ వస్తున్నారు. గతంలో ఫాక్స్‌కాన్, అమరరాజా ప్రతినిధులు ఇప్పటికే ఆయనతో భేటీ కాగా.. అదానీ గ్రూప్ ప్రతినిధులు కూడా ఈ ఏడాది జనవరిలోనే రేవంత్‌ను సచివాలయంలో కలిశారు. ఇందులో గౌతమ్ అదానీ కుమారుడు కరన్ అదానీ కూడా ఉన్నారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబుడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. దీనికి రేవంత్ కూడా స్వాగతించారు. 

Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

దరఖాస్తులు ప్రారంభం

ప్రస్తుతం వివిధ రంగాల్లో విద్యార్థులకు నైపుణ్యాలను అందించి ఉద్యోగాలు కల్పించే దిశగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 4నుంచి కోర్సులు మొదలుకానుండగా.. తొలి విడతగా 3 స్కూల్స్‌ ఏర్పాటు చేసి అందులో 4 కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

స్కిల్ యూనివర్సిటీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నందున అది పూర్తయ్యేవరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ క్యాంపస్‌లలో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ఈ ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలనే ఆసక్తిగల అభ్యర్థులు ఈ యూనివర్సిటీలో చేరేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. 

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment