రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. హైకోర్టుకు అల్లు అర్జున్ మామ

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేబీఆర్ పార్క్ ప్రాజక్ట్‌కు వ్యతిరేఖిస్తూ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పార్కు చుట్టూ 6 జంక్షన్ల అభివృద్దిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులను 2 ప్యాకేజీలుగా చేపట్టాలనుకుంటోంది.

New Update
banny mama

banny mama Photograph: (banny mama)

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేబీఆర్ పార్క్ ప్రాజక్ట్‌కు వ్యతిరేఖిస్తూ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో తన ఇంటిని కూల్చొద్దని ఆయన కోరారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌తో పాటు మరో నాలుగు పిటిషన్‌లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్దిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులను రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు.

Also Read :  చర్చ్ ముందే నలుగురు మృతి.. హైటెన్షన్ వైర్లకు తగిలి మలమల మాడిపోయారు

ట్రాఫిక్‌ను నివారించేందుకు, పర్యావరణ పరంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ఇప్పటికే ప్రజావాణిలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి , సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తోపాటు పలువురు సినీ ప్రముఖుల ఇండ్లు కూడా కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి.

Also read : AP Assembly: కళ్లు చదిరేలా ఏపీ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు.. టెండర్లుకు నోటిఫికేషన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Wine Shops: మందుబాబులకు షాక్.. ఆరోజున వైన్‌ షాపులు బంద్

ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు కాంపౌడ్లు మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశించారు.

New Update
Wine Shops

Wine Shops

ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆరోజున వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు కాంపౌడ్లు మూసివేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశారు జారీ చేశారు. అయితే స్టార్ హోటళ్లోని బార్లు, రిజిస్టర్డ్‌ చేసుకున్న క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు.

Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్‌ బిలియనీర్‌ కేసులో భయంకర నిజాలు!

తమ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దొంగచాటుగా ఎవరైనా మద్యం విక్రయాలు చేస్తే వాళ్ల లైసెన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరికలు చేశారు. హనుమాన్ జయంతి రోజున ఎలంటి మతపరమైన గొడవలు జరగకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Also Read: ఇదేం మూర్ఖత్వం.. పిరియడ్స్ ఉన్న విద్యార్థికి క్లాస్ బయట పరీక్ష

ఇదిలాఉండగా తెలంగాణ బెవరేజెస్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ మద్యానికి జారీ చేసిన ప్రకటనకు సైతం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మద్యం సరఫరాదార్లు, తయారీ దార్ల నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చాయి.  తాము 604 రకాల మద్యం బ్రాండ్లను సరఫరా చేస్తామని 92 మద్యం సరఫరా చేసే కంపెనీలు అప్లై చేసుకున్నాయి. ఈ 604 బ్రాండ్లలో 331 ఇండియన్​ మేడ్​ ఫారిన్​ లిక్కర్​ బ్రాండ్లు ఉన్నాయి. మిగతా 273 ఫారిన్ బ్రాండ్లు ఉన్నాయి.

Also Read:  బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

hanuman-jayanti | national-news 

 

Advertisment
Advertisment
Advertisment