Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియ గడువు పొడగింపు..

తెలంగాణ అసలైన రేషన్ కార్డు లబ్దిదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటివరకు 75.56 శాతం మంది మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయడంతో.. ఫిబ్రవరి 29 వరకు గడువును పొడగిస్తూ రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

New Update
Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియ గడువు పొడగింపు..

E-KYC : తెలంగాణ(Telangana) లో ప్రస్తుతం రేషన్ కార్డు(Ration Card) ల ఈకేవైసీ(E-KYC) ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి 31న ఈ గడువు తేది ముగియనుంది. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో ఈ కేవైసీని అప్‌డేట్(E-KYC Update) చేస్తునే ఉన్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 75.56 శాతం మంది మాత్రమే ఇది పూర్తి చేశారు. ఇంకా 25 శాతం శాతం పూర్తి చేయడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువు తేదీని వచ్చే నెల ఫిబ్రవరి ఆఖరు వరకు పొడగించింది. అంటే ఫిబ్రవరి 29 వరకు ఈ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.

Also Read: హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాక్‌.. కేసులు నమోదు!

కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా 

అసలైన రేషన్ కార్డు లబ్దిదారులను గుర్తించేందుకు జనవరి 31లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఇంకా కోట్లాదిమంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రేవంత్‌ సర్కార్‌(Revanth Sarkar) కూడా ఈకేవైసీ గడువును పెంచింది.

100 శాతం పూర్తి చేయాలి

త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచనలు చేసింది. ఫిబ్రవరి నెలఖారులోగా 100 శాతం ఈకేవైసీ పూర్తయ్యేలా చూడాలని సూచించారు.ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్‌(Hyderabad) ప్రధాన రేషన్‌ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డ్‌ల కోసం కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈకేవైసీ ప్రక్రియ పూర్తైన తర్వాతే కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Also Read: ఇంటర్‌ పాస్‌ అయితే చాలు.. టీఎస్‌ఆర్టీసీలో జాబ్‌ కొట్టే ఛాన్స్! వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment