Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు గాలం.. కేబినేట్ విస్తరణ ఎప్పుడంటే ?

తెలంగాణలో జులై మొదటివారంలో కేబినేట్ విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మరికొంతమంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లు సమాచారం. వాళ్లు వచ్చాకే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు గాలం.. కేబినేట్ విస్తరణ ఎప్పుడంటే ?

Telangana Cabinet: తెలంగాణ కేబినేట్ విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. జులై మొదటివారంలో కేబినేట్ విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అయితే మరికొంతమంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు (BRS MLA) కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లు సమాచారం. వాళ్లు వచ్చాకే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది బీఆర్ఎస్‌ సీనియర్ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్‌లోకి (Congress) వస్తామని కండీషన్ పెడుతున్నారు. అందుకే విస్తరణ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: హోరాహోరీగా ట్రంప్ – బైడెన్ మధ్య డిబేట్

అయితే ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. అందుకే కొందరికి మంత్రి పదవులు ఇచ్చి పార్టీలోకి లాగాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పార్టీలోకి పూర్తిస్థాయి చేరికలు జరిగిన తర్వాతే కేబినెట్ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు కొందరు సీనియర్ నేతలు కేసీఆర్‌ను కలవలేదు. ఇటీవల పోచారం శ్రీనివాస రెడ్డి, తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకా ఎవరెవరు చేరతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read: మనకు గిదో లెక్కనా.. దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CLP meeting : కాంగ్రెస్ MLA ల జీతాలు కట్....పార్టీ కీలక నిర్ణయం

పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25 వేలు తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం వీటిని వినియోగించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

New Update
CLP meeting

CLP meeting

CLP meeting :  పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25,000 విరాళం తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, రాబోయే ఎన్నికల సన్నాహాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ విరాళాలను వినియోగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నోవోటెల్‌ వేదికగా జరిగిన CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హస్తం నేతలందరి లక్ష్యం ఒక్కటే అయ్యి ఉండాలని.. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read :  ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

ఇక నుంచి ఎమ్మెల్యేలంతా జనాల్లో ఉండాలని, విస్తృతంగా గ్రామాల్లో పర్యటించాలని రేవంత్‌ సూచించారు.పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడకూడదు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని హెచ్చరించారు.భయపడే పరిస్థితిలో పార్టీ లేదు. అద్దంకి దయాకర్‌లాగా అందరూ ఓపికతో ఉండాలి.అద్దంకి దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

 మంత్రివర్గ విస్తరణ అంశం హైకమాండ్ చూసుకుంటుందని, మంత్రివర్గ విస్తరణ గురించి ఎవరూ బహిరంగంగా బయట మాట్లాడొద్దని సీఎం వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరిగింది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంపై నేతలకు వివరించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

 

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Advertisment
Advertisment
Advertisment