Vizag : సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్
ఒకవైపు తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు.
ఒకవైపు తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు.
విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది.కానీ డ్యూటీ తరువాత బయటకు వెళ్లినట్టు లేదు.
అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కింద ఉన్న కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడారు. ఈ ప్రమాదంలో మరి కొంద మంది గల్లంతైనట్లు సమాచారం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వివరించారు.
విమానాశ్రయానికి కరెక్ట్ టైమ్ కి చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడు ఎలాగైనా కాసేపు విమానాన్ని ఆపాలనుకున్నాడు. దీంతో విమానంలో బాంబు పెట్టానంటూ బెదిరించిన ఘటన మంగళవారం జరిగింది.
తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్లలో ఓ ట్రైన్ కి మరో స్టాప్ అదనంగా చేరింది. సికింద్రాబాద్ -విశాఖపట్నం- సికింద్రాబాద్ ట్రైన్ ఇక నుంచి ఏలూరులో కూడా ఆగనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు.
విశాఖ ఆర్కే బీచ్లో ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. జట్టి నుంచి ఆర్కే బీచ్కు బోటుకు కొట్టుకువచ్చింది. ప్రమాద సమయంలో ఐదుగురు మత్స్యకారులు బోటులో ఉన్నారు. అలల ప్రభావంతో బోటు ముక్కలు ముక్కలైంది. అయినప్పటికీ ఐదుగు మత్స్యకారులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే.అయితే గురువారం మాత్రం భూ ఉపరితలం పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్టణం వాతావరణశాఖ తెలిపింది.
ఏపీలో ఆగస్టు 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం పెద్ద ఛాలెంజే. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీకి కూడా సవాలే. గెలువరిదనేదానిపై ఆసక్తి నెలకొంది.