Telangana: తెలంగాణలో 8మంది నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ.
తెలంగాణలో ఎనిమిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ఎనిమిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. అక్రమంగా హెరాయిన్ను రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను SOT పోలీసులు నడిరోడ్డుపై పట్టుకున్నారు. నిందితుల నుంచి 34 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు హతమయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి పోలీసులు వెళ్లినట్లు సమాచారం. దాదాపు రెండు గంటల పాటు వారు ఆమెతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఆకతాయిలకు ముకుతాడు వేసేందుకు హై ఎండ్ బైక్స్ కొనుగోలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఎండబ్ల్యూ, హర్లీ డెవిడ్ సన్ బైక్ కొనుగోలు చేస్తామని చెబుతోంది. రహదారిలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణలో 8 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్ బదిలీ అయ్యారు. అలాగే ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, మరికొంతమంది అధికారులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు.
కల్కి సినిమాలకు బెనిఫిట్ షో లకు అభిమానులు పోటెత్తడంతో పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓ థియేటర్ వద్ద అభిమానులు మితీమిరి ప్రవర్తించడంతో పోలీసులు ప్రభాస్ అభిమానుల మీద లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
శుక్రవారం రాత్రి కాల్పులతో హైదరాబాద్ నగరం దద్ధరిల్లింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో నరగవాసులు హడలిపోయారు. ఏం జరుగుతోందో తెలియక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికారు. హైదరాబాద్ చిలకలగూడలో సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.
మెట్రో ట్రైన్ లేడీస్ కోచ్ లో ప్రయాణించిన పురుషులకు పోలీసులు చెంపదెబ్బతో స్వాగతం పలికారు. ఢిల్లీ మెట్రో చాలా రద్దీగా ఉండటంతో మహిళల కంపార్ట్ మెంట్లను సైతం వదలకుండా యువకులు ఎక్కేశారు. దీంతో స్త్రీ ల కంప్లైట్ తో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.