Group-1: గ్రూప్1 పరీక్షా కేంద్రంలో కలకలం.. గోడ దూకిన అభ్యర్థి!

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని ఓ ఎగ్జామ్ సెంటర్‌కు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి మాథ్యూస్‌ గోడదూకి పరీక్షా హాల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అతన్ని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

New Update
se edre

Group-1: తెలంగాణలో సోమవారం మొదలైన గ్రూప్-1 మెయిన్స్ ఓ పరీక్షా కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాల్సిన ఓ అభ్యర్థి నిమిషం ఆలస్యంగా వచ్చారు. దీంతో సెక్యూరిటీ అతడిని లోపలికి అనుమతించకపోవడంతో గోడ దూకి పరీక్షా హాల్ వైపు పరుగెత్తాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గ్రూప్-1 అభ్యర్థి మాథ్యూస్‌ను అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చివరి నిమిషంలో పోలీసులు సాయం.. 

ఇదిలా ఉంటే.. మరో పరీక్షా కేంద్రానికి వస్తున్న అభ్యర్థికి ఆలస్యం కావడంతో తెలంగాణ పోలీసులు సహాయం చేశారు. ట్రాఫిక్ సమస్యతో తంటాలుపడుతున్న ఓ అభ్యర్థిని చివరి నిమిషంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో గీతాంజలి కాలేజీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు కీసర ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. పోలీసులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: మనిషి బూడిదకు రూ.400 కోట్లు.. చితాభస్మంలో విలువైన లోహాలు!

ప్రశాంతంగా ముగిసిన మొదటి పరీక్ష..

తెలంగాణలో బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్‌ మొదటి పేపర్ పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్ కు భారీగా హాజరు శాతం నమోదైంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు.. ఆలస్యంగా వచ్చినవారిని లోపలికి అనుమతించలేదు. ఇక పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు. పరీక్ష  కేంద్రాల దగ్గరలో 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఎవరినీ ఉండనివ్వలేదు. 

ఇది కూడా చదవండి: సల్మాన్‌కు ఆ విషయం తెలియదు.. మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment