ED: కేటీఆర్కు బిగ్ షాక్.. మరో కేసు నమోదు
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. కేటీఆర్పై మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. కేటీఆర్పై మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసును మరో వారం రోజులపాటు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించమని సీఎం రేవంత్ హెచ్చరించారు. 'హరీష్ పరిస్థితి మాకు అర్ధమైంది. అసెంబ్లీలో చొక్కాలు చించుకోకపోతే ఇంటి దగ్గర కొరడా దెబ్బలు ఉంటాయి. మామకు అంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదు. కేటీఆర్ను హరీష్ ఇరికించారు' అన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ ఈవెంట్లో కేటీఆర్తో తమకు చీకటి ఒప్పందం ఉందని నిర్వాహకులు స్వయంగా చెప్పారని సీఎం రేవంత్ అన్నారు. రూ.600 కోట్లు దోచుకునేందుకు సెటిల్మెంట్ కుదిరిందన్నారు. తాము అధికారంలోకి రావడంతో బాగోతం బటయపడిందన్నారు.
హైకోర్టులో కేటీఆర్ తరఫున న్యాయవాది సుందరం తన వాదనలు వినిపించారు. కేటీఆర్ లబ్ధి పొందినట్లు FIRలో పొందుపర్చలేదని.. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని తెలిపారు. ఆయనపై పెట్టిన పీసి యాక్ట్ వర్తించదని పేర్కొన్నారు.
జైలుకు వెళ్లి యోగా చేస్తానని చెప్పిన కేటీఆర్.. ఈ- కార్ రేస్ వ్యవహారంపై ఎందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఒకవేళ తప్పు చేయలేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావొచ్చు కదా అని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ సమస్యలపై సీఎంకు వారు వినతి పత్రం అందించారు. దీంతో వారు పార్టీ మారే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అన్న చర్చ మొదలైంది.