Iran: దారుణంగా పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. ఒక్క డాలర్కు 12 లక్షల రియాల్స్
ఇరాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్తో పోలిస్తే ఏకంగా 12 లక్షల రియాల్స్కు దిగజారిపోయింది.
ఇరాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్తో పోలిస్తే ఏకంగా 12 లక్షల రియాల్స్కు దిగజారిపోయింది.
ఇరాన్ ప్రభుత్వం వరుసగా మరణశిక్షలు అమలు చేస్తోంది. దీన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా వెయ్యి మందికి మరణశిక్షలు అమలు చేసిందని ఇరాన్ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.
ఇజ్రాయెల్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాకిస్తాన్లో పర్యటించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు ఇరాన్ న్యూక్లియర్ ప్రొగామ్కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు తెలిపింది.
ఇరాన్లో ఉగ్రవాదులు కోర్టుపైనే కాల్పులు జరిపారు. సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్లోని కోర్టు బిల్డింగ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు పౌరులు, ముగ్గురు దాడి చేసినవారు సహా కనీసం ఎనిమిది మంది మరణించారు.
దాడులు, కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డారు. టెల్ అవీవ్ ఒక క్యాన్సర్ కణితి లాంటిదని అన్నారు. ఇజ్రాయెల్ నేరాల్లో అమెరికా పాలుపంచుకుంటోందని ఖమేనీ మండిపడ్డారు.
అణు చర్చలపై ఇరాన్ మళ్ళీ మాట్లాడింది. దాడులు చేయమని హాయీ ఇస్తే అమెరికా తో చర్చలకు సిద్ధమని తెలిపింది. అంతకు ముందు అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదని చెప్పిన ఇరాన్ ఇప్పుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.
తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు.
యుద్ధం జరిగినప్పటినుంచి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన బయటికొచ్చారు. శనివారం సెంట్రల్ టెహ్రాన్లోని ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు.