IRGC Attacks: హర్మూజ్ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నౌకల్లో ఓ భారతీయ నౌక కూడా ఉండటం కలకలం రేపుతోంది.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నౌకల్లో ఓ భారతీయ నౌక కూడా ఉండటం కలకలం రేపుతోంది.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు హార్మూజ్ జలసంధి వైపే చూస్తున్నాయి. ఈ కీలకమైన సముద్ర మార్గం మూతపడటంతో చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగలు పుడుతున్నాయి.
హార్ముజ్ జలసంధి వ్యవహారంలో ఇరాన్ అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ జలమార్గాన్ని మూసివేస్తామంటూ ఇరాన్ చేస్తున్న ప్రకటనలను ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలుగా అభివర్ణించారు.