BIG BREAKING: ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఈ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారించారు. ఇటీవల నిర్వహించిన సోదాలకు సంబంధించి ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఈ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారించారు. ఇటీవల నిర్వహించిన సోదాలకు సంబంధించి ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డి .. మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.39కోట్లు నష్టం చేకూర్చినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. మొత్తం రూ.300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.
TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 7 వరకు పొడగిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మాజీ సీఎం కేసీఆర్కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై PMLA కింద కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ లేఖ రాసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది.
లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావించలేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. ఈడీ రిపోర్టులో కేసీఆర్ పేరు రాయలేదు. మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ స్కాం గురించి కేసీఆర్కు ముందే తెలుసని వెల్లడించింది. మద్యం వ్యాపారుల వివరాలు కవిత నేరుగా కేసీఆర్కు చెప్పిన్నట్లు ఆధారాలు లభించాయని, టీం సభ్యులను కేసీఆర్ కు కవిత పరిచయం చేసిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోడీ మరో సంచలన ప్రకటన చేశారు. అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బును పేదలకు పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం చట్టపరంగా మార్పులు చేసేందుకు వెనుకాడబోమన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కూడా దోషిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చాట్లను కనుగొన్నట్లు ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ లభిస్తుందని ఆశించిన కవితకు నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.